విద్యుత్తు బకాయిలు రూ.4,27,297
పై చిత్రంలో మీరు చూస్తున్న పూరి గుడిసె శివ్వంపేట మండలం కొంతాన్పల్లికి చెందిన వడ్ల లక్ష్మీకి చెందినది. భర్త సత్తయ్య. అప్పట్లో వీరికి పెంకుటిల్లు ఉండేది.
కరెంటు కనెక్షన్ తొలగించిన గుడిసె
పై చిత్రంలో మీరు చూస్తున్న పూరి గుడిసె శివ్వంపేట మండలం కొంతాన్పల్లికి చెందిన వడ్ల లక్ష్మీకి చెందినది. భర్త సత్తయ్య. అప్పట్లో వీరికి పెంకుటిల్లు ఉండేది. అది శిథిలమవ్వడంతో ప్రస్తుతం గుడిసె ఏర్పాటు చేసుకున్నారు. పదేళ్ల క్రితం సత్తయ్య మృతి చెందాడు. కాగా అతని పేరు విద్యుత్తు బిల్లు రూ.10వేల వరకూ బకాయి ఉందని ఆ శాఖా సిబ్బంది ఇటీవల కరెంటు కనెక్షన్ను తొలగించారు. లక్ష్మి బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉందని తెలుసుకుని, స్థానికంగానే ఉంటున్న వారి కొడుకులు లక్ష్మణ్, వెంకటేశ్ల ఇళ్లకూ విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. బకాయి ఉందని ముందస్తు నోటీసుగానీ, సమాచారంగానీ ఇవ్వకుండా అప్పటికప్పుడే బిల్లు కట్టాలని ఒత్తిడి తెచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడో వినియోగించిన విద్యుత్తుకు ఇప్పుడు బిల్లు చెల్లించాలనడం సరికాదని వాపోతున్నారు.
ఏళ్ల క్రితం వినియోగించినవి..
జిల్లాలో 1,85,098 సర్వీసులు ఉన్నాయి. దశాబ్దాల క్రితం వినియోగించిన విద్యుత్తుకు ఇప్పుడు లెక్కలు కట్టి మరీ వసూలు చేస్తున్నారు. తండ్రి పేర విద్యుత్తు బిల్లు బకాయి ఉంటే అతని కుమారులు చెల్లించాల్సిందేనని ముడి పెడుతున్నారు. తండ్రి భారాన్ని అనివార్యంగా తనయులు భరించాల్సిందేనంటూ అధికారులు వాదిస్తున్నారు.
చెల్లించకపోతే సరఫరా నిలిపివేత
విద్యుత్తు పంపిణీ సంస్థ మొండి బకాయిల వసూలులో కఠినంగా వ్యవహరిస్తోంది. తాతల, తండ్రుల కాలం నాటి బకాయిలను వారసుల నుంచి రాబట్టేందుకు నిర్ణయించింది. బకాయి పేరుకుపోగా కనెక్షన్ను వినియోగించకపోవడం, ఆ మీటరు పక్కన పెట్టి కొత్తది తీసుకుని నెట్టుకొస్తున్న వారిని గుర్తించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. గ్రామాలు, పట్టణాల్లో పాత ఇళ్లు శిథిలావస్థకు చేరడంతో వాటిని కూల్చివేసి కొత్తవి నిర్మించుకున్నారు. ఆ సమయంలో పాత మీటరు వదిలేసి కొత్తవి పొందారు. మరికొందరు ఉమ్మడి కుటుంబంలో నుంచి వేరు పడ్డారు. ఇంకొందరు వలసబాట పట్టారు. ఇలాంటి సందర్భాల్లో ఇంటి యజమాని పేర బకాయి ఉంటే ఆ కుటుంబ సభ్యులను బాధ్యులను చేస్తున్నారు. బకాయిలను చెల్లించాలని లేని ఎడల రక్త సంబంధీకుల కనెక్షన్లు తొలగిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కొన్నిచోట్ల సరఫరా నిలిపి వేసేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
న్యూస్టుడే, నర్సాపూర్
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..
ఉన్నతాధికారుల ఆదేశానుసారమే పాత బకాయిలు వసూలు చేస్తున్నాం. ఇందుకు కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది. సర్వీస్ వద్దనుకునే వారు దాని మీద అప్పటివరకు ఉన్న బకాయిని చెల్లించాలి. లేదంటే ఎప్పటికైనా ఆ సర్వీసు మీద ఉన్న బకాయిని అనుబంధంగా ఉన్న సర్వీస్ కనెక్షన్ల దారులు చెల్లించాల్సిందే. ఇళ్లు కొనుగోలు చేసే ముందు ఇంటి, నల్లా పన్నుల బకాయిలు ఉన్నాయా లేదా.. ఎలా సరిచూసుకుంటారో విద్యుత్తు బకాయిలపై వివరాలు అలానే తెలుసుకోవాలి. లేదంటే ఎప్పటికైనా ఆ బకాయి స్థానంలో ఉన్నవారిపై భారం పడుతుంది.
భాస్కర్రెడ్డి, ఏడీఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా