logo

ఉన్నత చదువుకు ఆర్థిక భరోసా

మండల పరిధి శాలిపేట గ్రామానికి చెందిన శ్రీజ ఆర్థిక ఇబ్బందులతో పదోతరగతి వరకు చదువు మానేసింది. కొన్ని నెలల క్రితం తండ్రి రమేష్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో తల్లి ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితమైంది.

Published : 04 Dec 2022 02:01 IST

నగదు అందిస్తున్న తిరుపతి రెడ్డి

చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: మండల పరిధి శాలిపేట గ్రామానికి చెందిన శ్రీజ ఆర్థిక ఇబ్బందులతో పదోతరగతి వరకు చదువు మానేసింది. కొన్ని నెలల క్రితం తండ్రి రమేష్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో తల్లి ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితమైంది.  ఇంటర్‌ మెదటి సంవత్సరంలో చేరినా కుటుంబ బాధ్యత శ్రీజపై పడటంతో చదువు మానేసి ఇంట్లోనే ఉంటూ బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. గ్రామస్థులు ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5వేలు అందించాడు. ఈ ఆర్థికసాయం ప్రతి నెల మీ ఇంటికి చేరుతుందని ఉన్నత చదువులకు చదువుకోవాలని, ఇందుకయ్యే ఖర్చు అందజేస్తానని శ్రీజకు మనోధైర్యాన్ని ఇచ్చాడు. చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు రమణ, వైస్‌ఎంపీపీ సత్యనారాయణ నాయకులు ఆంజనేయులు, ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని