సంకల్పంతో మెరిసి.. ప్రతిభతో మురిసి..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తీర్ణత ఒక్కటే సరిపోదు. మంచి మార్కులు సాధించాలి. మరోవైపు అన్ని రంగాల్లోనూ ప్రతిభ చాటితేనే ఉజ్వల భవిత సాధ్యం.
జాతీయ శిబిరాల్లో సత్తా చాటిన విద్యార్థులు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తీర్ణత ఒక్కటే సరిపోదు. మంచి మార్కులు సాధించాలి. మరోవైపు అన్ని రంగాల్లోనూ ప్రతిభ చాటితేనే ఉజ్వల భవిత సాధ్యం. లేదంటే ఎన్ని డిగ్రీలు పూర్తిచేసినా ఫలితం ఉండదు. ఉపాధి, ఉద్యోగాలకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు. దీన్ని గుర్తించే వారు అరుదుగా ఉంటారు. అన్నింటా రాణిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతారు. అందుకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వేదికగా చేసుకొని తమ ఆసక్తితో పలువురు రాణిస్తుండటం విశేషం.
ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ..
మన దేశం వివిధ భాషలు, సంస్కృతులకు నిలయం. జాతీయ సమైక్యత నిరంతరం కొనసాగించడం ముఖ్యం. ఇందుకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జాతీయ సమైక్యతా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలన్నది ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల కల. ఇందుకు ఎంతో శ్రమించాలి. పట్టుదలతో అడుగేయాలి. మరోవైపు రిపబ్లిక్ పరేడ్కు ప్రాతినిధ్యం వహించాలన్నది ఎన్సీసీ కేడేట్ల ధ్యేయం. దీన్ని సాధించేందుకు వివిధ దశలను దాటుకుంటూ రావాల్సిందే. ఈ సంకల్పంతో అడుగేసి పలువురు విద్యార్థులు సాధించి తమ సత్తా చాటారు.
ఉత్తమ వాలంటీర్లుగా..
హరియాణా రాష్ట్రం కురుక్షేత్రలో గత నెలలో జాతీయ సమైక్యత శిబిరం జరిగింది. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇందులో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. పవన్గౌడ్, కల్పన ప్రతిభతో ఆకట్టుకున్నారు. శిబిరంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై తమ ప్రదర్శనలతో నిర్వాహకులను ఆకట్టుకున్నారు. ప్రశంసలు అందుకున్నారు. పతకాలు సొంతం చేసుకున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాలంటీర్లు పాల్గొని తమదైన రీతిలో ప్రదర్శించారు. పవన్గౌడ్, కల్పనలు ఉత్తమ వాలంటీర్లుగా నిలిచారు.
తొలి స్థానంలో..
గజ్వేల్ బాలుర విద్యాసౌధంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న మధు ఆర్డీ పరేడ్కు ఎంపికయ్యారు. ప్రస్తుత విద్యాసంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు 80 రోజుల పాటు రాష్ట్రంలోని నిజామాబాద్, ఆదిలాబాద్తో పాటు ఏపీలోని తిరుపతిలో నిర్వహించిన ఎన్సీసీ క్యాంపుల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. కళాశాలలో ఎన్సీసీ సీనియర్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. గతేడాది ఉత్తమ కేడేట్గా గుర్తింపు సాధించారు. తద్వారా ఆర్డీలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు.
న్యూస్టుడే, గజ్వేల్ గ్రామీణ
బృందానికి నేతృత్వం
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం కార్యక్రమాల్లో భాగంగా జాతీయ సమైక్యత శిబిరం ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి ఈ సారి చేపట్టిన శిబిరానికి 30 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఈ బృందానికి కాంటిజెంట్ లీడర్గా తారా కళాశాలకు చెందిన పద్మజ వ్యవహరించారు. పక్కా కార్యాచరణతో విద్యార్థులు ప్రతిభ చాటేలా దిశానిర్దేశం చేశారు. శిబిరం నిర్వహణలో భేష్ అనిపించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం