విద్యా వాలంటీర్లు లేక.. బోధన సాగక..
అందోలు మండలం నేరడిగుంటలో గణితం, సాంఘికశాస్త్రం, తెలుగు సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాత్కాలికంగా ఎస్జీటీ ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసి బోధన చేయిస్తున్నారు.
ఉపాధ్యాయ ఖాళీలతో పిల్లలకు ఇబ్బందులు
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జోగిపేట టౌన్, కంగ్టి, మనూరు
* అందోలు మండలం నేరడిగుంటలో గణితం, సాంఘికశాస్త్రం, తెలుగు సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాత్కాలికంగా ఎస్జీటీ ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసి బోధన చేయిస్తున్నారు.
* నాగల్గిద్ద మండలం కారాముంగి జడ్పీ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులుండగా.. ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
* కంగ్టి జడ్పీ ఉన్నత పాఠశాలలో 535 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ 12 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. మరో 10 మంది అవసరం. తడ్కల్ జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం విద్యా వాలంటీర్లను నియమించకపోవడం సమస్యగా మారింది. పిల్లలకు బోధనపై ప్రభావం చూపుతోంది.
1,328 మంది అవసరం
జిల్లాలో 864 ప్రాథమిక, 199 ప్రాథమికోన్నత, 203 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 1.27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో 4,927 మంది ఉపాధ్యాయులు బోధిస్తుండగా.. 1328 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరి స్థానంలో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన వారిని విద్యా వాలంటీర్లుగా నియమిస్తే విద్యార్థులకు అన్ని సబ్జెక్టు బోధించేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువులో వెనుకబడినట్లు వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. చాలా చోట్ల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడం.. ఉన్న ఉపాధ్యాయులనే సర్దుబాటు చేయడంతో పిల్లలకు పాఠాలు అర్థం కావడం లేదు. విద్యాశాఖ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది.
పది విద్యార్థులపై ప్రభావం
ప్రతి విద్యార్థికి పదో తరగతి కీలకం. చాలా పాఠశాలల్లో కొన్ని సబ్జెక్టులు బోధించేందుకు ప్రత్యేక ఉపాధ్యాయులు లేకపోవడం వీరి చదువులపై ప్రభావం చూపుతోంది. కీలకమైన పాఠ్యాంశాలకు ఉపాధ్యాయులు లేకపోవడంతో.. నేర్చుకోలేకపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల్లో విద్యా వాలంటీర్లను నియమిస్తే కొంతమేరకైనా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.
సర్దుబాటు చేస్తున్నాం..: రాజేశ్, జిల్లా విద్యాధికారి
జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. అలాంటి వాటిని గుర్తించి అవసరమైన చోట డిప్యూటేషన్పై ఉపాధ్యాయులను ఇప్పటికే నియమించాం. ఇంకా ఎక్కడైనా అవసరమని ప్రధానోపాధ్యాయులు కోరితే అర్హులైన ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్