logo

Narsapur: కుమారుడి ప్రేమ వివాహం..తండ్రి ప్రాణం తీసింది

చిన్నకుమారుడు తనకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకున్నాడని మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం మూసాపేటలో చోటుచేసుకుంది.

Updated : 05 Dec 2022 08:02 IST

నర్సాపూర్‌, నర్సాపూర్‌ రూరల్‌, న్యూస్‌టుడే: చిన్నకుమారుడు తనకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకున్నాడని మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం మూసాపేటలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ జైపాల్‌రెడ్డి తెలిపిన వివరాలు.. మూసాపేటకు చెందిన వెంకగోని అంజాగౌడ్‌ (52), మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అంజాగౌడ్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చిన్న కుమారుడు వేణుగోపాల్‌గౌడ్‌ ఇదే గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకోగా ఇరు కుటుంబాలు విభేదించాయి.

తమకు ప్రాణహాని ఉందని నర్సాపూర్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీని వారు ఆశ్రయించారు. శనివారం నర్సాపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి అనిత ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. వారిని ఒప్పించి పెళ్లి చేశారు. దీంతో మనోవేదనకు గురైన వేణుగోపాల్‌ తండ్రి అంజాగౌడ్‌..  అదే రోజు సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు అన్ని చోట్ల వెతికారు ఈ క్రమంలో గ్రామ శివారులోని అర్కకుంట సమీపంలో అంజాగౌడ్‌ ఓ చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించాడు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టామని ఏఎస్‌ఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని