ఆయకట్టు సాగుకు నీరందేనా..?
ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని జలవనరులు నిండు కుండను తలపిస్తున్నాయి. యాసంగి సాగు జోరుగా ఉంటుందని అన్నదాతలు ఆనందపడ్డారు.
మరమ్మతులకు నోచక ఇబ్బందులు
న్యూస్టుడే, చేగుంట, వెల్దుర్తి, పాపన్నపేట, హావేలిఘనపూర్, నర్సాపూర్ రూరల్, శివ్వంపేట, టేక్మాల్, చిలప్చెడ్
హల్దీ ప్రాజెక్టు ఎడమ కాలువ దుస్థితి
ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని జలవనరులు నిండు కుండను తలపిస్తున్నాయి. యాసంగి సాగు జోరుగా ఉంటుందని అన్నదాతలు ఆనందపడ్డారు. ప్రస్తుతం వరి సాగుకు సన్నద్ధమవుతుండగా కొందరు నారుమళ్లు పోశారు. ఎరువులు, పురుగు మందులు సిద్దం చేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయకట్టు కాలువలు మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా మారాయి. చుక్క సాగు నీరు పొలాలకు చేరే పరిస్థితి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని కాలువలు ధ్వంసం కాగా, ఇంకొన్ని గండ్లు పడ్డాయి. పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగి శిథిలమయ్యాయని వాపోతున్నారు. ఈ సీజన్ తైబంది ప్రక్రియ పూర్తయ్యేలోగా ఆ శాఖ అధికారులు కాలువల మరమ్మతులు చేయించి, పొదలు, చెట్లు, చెత్తను తొలగించాలని కోరుతున్నారు. జిల్లాలో పలు ఆయకట్టు కాలువలపై ‘న్యూస్టుడే’ పరిశీలనాత్మక కథనం..
జిల్లాలో 100 ఎకరాల్లోపు 2,802, 100-500 ఎకరాల్లోపు 258, 500 ఎకరాలకు పైబడి 70 చెరువులు ఉన్నాయి. హల్దీ ప్రాజెక్టు, ఘనపురం ఆనకట్ట ఉన్నాయి. వీటి కింద యాసంగిలో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటుండగా కాలువలు దెబ్బతినడంతో చివరి పొలాలకు నీరు అందటం కష్టంగా మారింది. 15 ఏళ్ల క్రితం వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు. నిర్వహణ లేకపోవడంతో కాలక్రమేణా కాలువలు నామరూపాల్లేకుండా పోయాయి. దీంతో నీరు పారకం కష్టంగా ఉంది.
వడియారంలో..
హల్దీ ప్రాజెక్టూ అధ్వానమే..
మాసాయిపేట మండలం హల్దీ ప్రాజెక్టు ఆయకట్టులో మొత్తం 2,900 ఎకరాలు ఉంది. 24 కి.మీ ఉన్న కుడి కాలువ కింద 2000 ఎకరాలు, 14 కి.మీ ఉన్న ఎడమ కాలువ కింద 900 ఎకరాలు ఉంది. కాగా రెండు కాలువలకు 7 కిలోమీటర్ల చొప్పున మాత్రమే గైడ్వాల్ నిర్మించారు. దీంతో ప్రాజెక్టు కింద కేవలం 400 ఎకరాలకు మించి సాగునీరు అందించలేని పరిస్థితి ఉంది. చాలాచోట్ల కాలువలు నామరూపాలు లేకుండా భూమట్టం అయ్యాయి. చెట్లు, పొదలు పెరిగాయి.
అన్నింటా అదే తీరు..
వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో మొత్తం 245 చెరువులు, కుంటలు ఉన్నా ఆయకట్టు కాలువలన్నీ శిథిలమయ్యాయి. ఉమ్మడి మండలంలో పెద్ద చెరువులైన వెల్దుర్తి దేవతల చెరువు, కుడి, మాసాయిపేట రామప్ప, మానేపల్లి పెద్ద చెరువు, ఊర, మన్నెవారిజలాల్పూర్ ఊర చెరువు, యశ్వంతరావుపేట, కుకునూర్ ఎల్లమ్మ చెరువుల కాలువలదీ అదే పరిస్థితి. మొత్తం 14 వేల ఎకరాల్లో వరి సాగుచేసేందుకు రైతులు సిద్ధం అయ్యారు. చేగుంట మండలంలో కాలువల్ని రైతులే బాగు చేసుకుంటున్నారు. నర్సాపూర్ మండలంలో 188 చెరువులు, కుంటలు ఉండగా వీటి కింద 16,874 ఎకరాల ఆయకట్టు ఉన్నా సాగునీరు పారే అవకాశం లేదు. పాపన్నపేట, హవేలిఘనపూర్, శివ్వంపేటలోనూ ఏ ఒక్క జలవనరు కాలువలు బాలేవు. చిలప్చెడ్, టేక్మాల్ మండలాల్లోనూ పొలాలకు నీరందే అవకాశం లేదు.
హవేలిఘనపూర్ చెరువు నుంచి వృథాగా పోతున్న నీరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్