వేదనాదం.. విజ్ఞాన ప్రబోధం
వేదం.. లోకానికి జ్ఞానాన్ని సమకూర్చింది. మానవ మనుగడను, జీవిత పరామర్థాన్ని సూచిస్తుంది. అలాంటి వేదం చదివే వారు తగ్గిపోయారు.
న్యూస్టుడే, రామాయంపేట
వేదం.. లోకానికి జ్ఞానాన్ని సమకూర్చింది. మానవ మనుగడను, జీవిత పరామర్థాన్ని సూచిస్తుంది. అలాంటి వేదం చదివే వారు తగ్గిపోయారు. ప్రస్తుతం దీన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పం, భావితరాలకు అందించాలన్న లక్ష్యంతో రామాయంపేటకు చెందిన పడకంటి సంగమేశ్వర్ ముందడుగు వేశారు. ఇందుకు రామాయంపేటలో సాందీపని పేరిట పాఠశాలను నెలకొల్పారు.
2017లో..
వేద విద్యతో సకలం అందుతుందని సంగమేశ్వర్.. కంకణాల కిషన్, ముత్యాలు పలువురి దాతల సహకారంతో 2017 ఏప్రిల్లో వేదగురుకుల పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం నిజామాబాద్, మోర్తాడ్, మహారాష్ట్రతో పాటు బిహార్ తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.
యాగంలో
నిత్యం యోగాసనాలు..
పూర్వకాలంలో బ్రహ్మచర్యం పాటిస్తూ విద్యార్థులు ఎలాగైతే వేద విద్యను అభ్యసించేవారో.. ఇదే విధానాన్ని ఇక్కడ పాటిస్తుండటం గమనార్హం. తెల్లవారు జాము 4 గంటలకు విద్యార్థుల దినచర్య మొదలవుతుంది. యోగాసనాలు, సూర్యనమస్కారాలు చేస్తారు. ప్రకృతి సంరక్షణకు నిత్యం ఉదయం ఆచార్యులు వేదకరాచారా ఆధ్వర్యంలో బ్రహ్మయజ్ఞం నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న 16 మందిని రెండు విభాగాలుగా విభజించి బోధన కొనసాగిస్తున్నారు. యాగం చేసేందుకు దాతల సహకారంతో యాగశాలను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. నాలుగు వేదాలు, ఉపనిషత్తులు బోధిస్తున్నారు. వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా తెలుగు, హిందీ, ఆంగ్లం నేర్పిస్తున్నారు. మరోవైపు సాంకేతిక విద్యను సైతం నేర్పిస్తున్నారు.
గో సంరక్షణ
ప్రకృతి వ్యవసాయంలో గోవు అత్యంత కీలకం. ఈ దిశగా రైతులను అడుగేయించాలన్న ఉద్దేశంతో పాఠశాలలో ప్రత్యేకంగా గిరిజాతి గోవుల పోషణ చేపట్టారు. పాఠశాలలో ఓ వైపు షెడ్డు నిర్మాణం చేపట్టి 28 ఆవులను పోషిస్తున్నారు. వాటి పాలు, గోపంచకం స్థానిక రైతులకు ఉచితంగా అందజేస్తున్నారు. గిరిజాతి ఆవులను కాపాడటంతో పాటు వాటి వల్ల కలిగే మేలు వివరిస్తున్నారు.
నిర్వహణ భారం..
సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో జాతీయ రహదారి పక్కనే రామాయంపేట సమీపంలో ప్రశాంత వాతావరణంలో ఎకరా స్థలంలో వేద పాఠశాల నిర్వహిస్తున్నారు. నిధులు లేక నిర్వహణ భారంగా మారింది. ప్రతి నెలా రూ.లక్ష వరకు వెచ్చించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. దాతలు స్పందిస్తే మరో 30 మందికి బోధించేందుకు అవకాశం ఉందంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు