కేసీఆర్ కృషితో దుబ్బాక అభివృద్ధి: మంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్కు దుబ్బాకపై ప్రత్యేక ప్రేమ ఉందని మంత్రి హరీశ్రావు అన్నారు.
బస్సు సర్వీసు ప్రారంభిస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్, మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్, ఎంపీ, ఎమ్మెల్యే
చేగుంట, దుబ్బాక, మిరుదొడ్డి, న్యూస్టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్కు దుబ్బాకపై ప్రత్యేక ప్రేమ ఉందని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్, నిరంజన్రెడ్డిలు దుబ్బాక, మండల పరిధిలోని పోతారం, హబ్షీపూర్, రాజక్కపేటలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. దుబ్బాక నుంచి తిరుపతి, హన్మకొండలకు బస్సు సర్వీస్లను ఆర్టీసీ ఛైర్మన్ గోవర్ధన్తో కలిసి మంత్రులు ప్రారంభించారు. అనంతరం మార్కెట్ కమిటీ ఆవరణలో నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో హరీశ్ రావు మాట్లాడారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో వసతుల కల్పనతో పాటు అంగన్వాడీ కేంద్రం, రేషన్ దుకాణం, బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తామన్నారు. 15 రోజుల్లో ఇక్కడి ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం జలాశయంతో కూడవెల్లి వాగు జీవధారగా మారిందన్నారు. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ దుబ్బాక డిపోకు మరిన్ని కొత్త బస్సుల మంజూరుకు సిద్ధమన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ చొరవతో ఇటీవల మంజూరైన రూ.20 కోట్లతో అంతర్గత దారులు, మురుగు కాలవల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రఘునందన్రావు, ఎమ్మెల్సీలు ఫారుఖ్హుస్సేన్, బండ ప్రకాశ్, యాదవరెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ రోజాశర్మ, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్, పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ సభ్యుడు రవీందర్రెడ్డి, పుర ఛైర్పర్సన్ వనిత, ఏఎంసీ ఛైర్ పర్సన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవంలో రసాభాస
హబ్షీపూర్ శివారులో గోదాం ప్రారంభానికి మంత్రులు రావడంతో భాజపా కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. దీంతో భారాస కార్యకర్తలు పోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యే రఘునందన్రావు కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేస్తూనే హడావుడిగా గోదాంను ప్రారంభించారు. మంత్రుల కంటే ముందే ఎమ్మెల్యే రఘునందన్రావు దుబ్బాకలో కొత్త బస్టాండ్కు చేరుకున్నారు. మంత్రులు ద్విచక్ర వాహన ర్యాలీతో బస్టాండ్ ప్రాంతానికి చేరుకోగానే మరోసారి ఇరుపార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. కార్యకర్తల తోపులాట మధ్యే మూడు బస్సులను ప్రారంభించారు. మంత్రి హరీశ్రావు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. సీపీ శ్వేత కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు.
పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM