పకడ్బందీగా.. పచ్చందాల పెంపు
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపడుతోంది. ఏడేళ్ల నుంచి పల్లె, పట్నం తేడా లేకుండా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటడంతో, ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఎనిమిదో విడతకు సన్నద్ధత
న్యూస్టుడే,మెదక్
మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో నర్సరీ
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపడుతోంది. ఏడేళ్ల నుంచి పల్లె, పట్నం తేడా లేకుండా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటడంతో, ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఏటా నర్సరీల్లో వివిధ రకాల వాటిని పెంచుతూ.. వానాకాలంలో వాటిని నాటేలా అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో ఎనిమిదో విడతకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రతి నర్సరీలో పలు రకాలవి పెంచేలా కార్యాచరణ చేపట్టారు. గతేడాది ఉన్న వాటిని పెద్దసంచుల్లోకి మారుస్తుండగా, కొత్తవి పెంచేందుకు సంచుల్లో విత్తనాలు వేసి మట్టి నింపుతున్నారు.
జిల్లాలో 469 పంచాయతీల్లో ఏడో విడతతో లక్ష్యానికి మించి నాటడం గమనార్హం. గ్రామాలు, పట్టణాల్లో పెద్దసంఖ్యలో మొక్కలు నాటారు. మండల కేంద్రాలతో పాటు ఆయా ప్రాంతాలకు వెళ్లే రహదారులకు ఇరువైపులా నాటడంతో, అవి నేడు వృక్షాలుగా మారాయి. అటవీప్రాంతాల్లోను ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కాలుష్యనివారణ, పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఎనిమిదో విడతలో అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 35.92 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఆ మేరకు పంచాయతీలు, పురపాలికల్లోని నర్సరీల్లో పెంపకం పనులు ప్రారంభమయ్యాయి ఆయా నర్సరీల్లో 53.23 లక్షలు కొత్తగా పెంచనున్నారు. గతేడాది 13.96 లక్షల మిగిలాయి. వాటిని కూడా ఈ సారి వినియోగించనున్నారు. సంచుల్లో మట్టి నింపి, రకరకా మొక్కల విత్తనాలు వేసి పెంచుతున్నారు. ఆయా మండలాల అధికారులు యాదాద్రి, సిద్దిపేట, అనంతపురం, బెంగళూర్ ప్రాంతాల నుంచి కొనుగోలు చేశారు. గతేడాది 115.57 శాతం మేర మొక్కలను నాటారు. 8.39 లక్షలను ఇంటింటికీ పంపిణీ చేసి, వాటిని నాటేలా చర్యలు తీసుకున్నారు.
పౌష్టికాహారం అందించేందుకు..
విద్యార్థులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్న సంకల్పంతో సర్కారు ముందుకు సాగుతోంది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో పెరటి తోటలను పెంచుతున్నారు. ఈసారి మునగకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మండలానికి రెండు చోట్ల స్వయం సహాయక సంఘాల మహిళల పంపిణీ చేయనున్నారు. వీటిని జిల్లాలో ఉన్న ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా, ఆదర్శ, అంగన్వాడీ కేంద్రాల్లో నాటేలా ప్రణాళిక రూపొందించారు. మునగకాయలు చేతికి అందాక ఆహారానికి వినియోగించనున్నారు. ఇవే కాకుండా ఇళ్లలో పెంచేవి, పూలవి, వెదురువి నాటేలా దృష్టి సారిస్తున్నారు.
వన సేవకులకు శిక్షణ ఇస్తున్నాం
శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
నర్సరీల్లో మొక్కల పెంపకం పకడ్బందీగా చేపడుతాం. ఉపాధి హామీ సిబ్బందికి అవగాహన కల్పించాం. ప్రస్తుతం మండల స్థాయిలో వనసేవకులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రతి మండలంలో ఈసారి నుంచి రెండు నర్సరీలను స్వయం సహాయక సంఘాల మహిళలకు కేటాయించాం. పరిరక్షణకు షేడ్ నెట్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులకు నిర్వహణ నిధులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 50శాతం నిధులు గత ఏడాది జులైలో ప్రభుత్వం విడుదల చేసింది. -
కొత్త రేషన్కార్డులకు.. కోడ్ అడ్డంకి
[ 28-03-2024]
ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది. -
సర్పంచి నుంచి.. ఎంపీ అభ్యర్థిగా..
[ 28-03-2024]
సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్ పొందడం గమనార్హం. -
గడువు ముంగిట పనుల హడావుడి
[ 28-03-2024]
పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు. -
కార్మికులకు గుర్తింపు.. పథకాలతో ప్రయోజనాలు
[ 28-03-2024]
కార్మికులకు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి జారీ చేసే గుర్తింపు కార్డులు చాలా ముఖ్యం. దీంతో సంఘంలో గుర్తింపు పాటు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. -
విద్యార్థులకు ప్రేరణ
[ 28-03-2024]
ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రేరణ పేరుతో వారికి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
ఈత కొలను తెరవరా?
[ 28-03-2024]
సిద్దిపేటలోని ఈత కొలను నిర్వహణ కొరవడుతోంది. నిత్యం కొనసాగించాల్సిన ఈ కొలను.. వేసవి ఆరంభమైన ఇంకా తెరవడం లేదు. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించి అందుబాటులోకి తెచ్చారు. -
అరచేతిలో లక్షల పుస్తకాలు
[ 28-03-2024]
ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు, కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
స్పందించండి.. సంధించండి
[ 28-03-2024]
ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా.. ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది. -
మహిళాభ్యున్నతికి సహకారం
[ 28-03-2024]
సహకార బ్యాంకులు మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైౖతులకు రుణాలు ఇవ్వడం..వసూలు చేయడానికి ఇవి గతంలో పరిమితమయ్యేవి. ఇప్పుడు మహిళలు అర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నాయి. -
దాత ఔదార్యం.. భక్తులకు సౌకర్యం
[ 28-03-2024]
వారి కులదైవమంటే ఆ దంపతులకు చాలా నమ్మకం. సొంత ఖర్చుతో దైవానికి ఆలయం నిర్మించారు. సరైన దారి లేక దర్శనానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించి తాజాగా వంతెన నిర్మిస్తున్నారు. -
ఆస్తి కోసం చిన్నమ్మనే కడతేర్చాడు
[ 28-03-2024]
ఈనెల 21న టేక్మాల్ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. -
నిండు మనసుతో ఆశీర్వదించండి
[ 28-03-2024]
ఈ ప్రాంత ప్రజాసమస్యలపై లోతైన అవగాహన ఉందని, ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించాలని మెదక్ పార్లమెంట్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. -
మాజీ కలెక్టర్కు వేల కోట్లు ఎక్కడివి?
[ 28-03-2024]
భారాస మెదక్ లోక్సభ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు.డిమాండ్ చేశారు. -
భారాస విజయం తథ్యం: కొత్త ప్రభాకర్రెడ్డి
[ 28-03-2024]
మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించటం తథ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లో మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు