భూవివాదంతో వృద్ధుడి ఆత్మహత్య
భూవివాదంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఓ వృద్ధుడు ఆత్మహత చేసుకున్న ఘటన మిరుదొడ్డిలో చోటుచేసుకుంది.
మిరుదొడ్డి, న్యూస్టుడే: భూవివాదంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఓ వృద్ధుడు ఆత్మహత చేసుకున్న ఘటన మిరుదొడ్డిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శ్రీధర్గౌడ్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మద్దెల కిష్టయ్య (75) ముప్పై ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మర్పడగ విజేందర్రెడ్డి వద్ద 1452 సర్వే నంబరులో గల ఏడు ఎకరాల సాగు భూమిని సాదా బై నామా ప్రకారం కొనుగోలు చేశాడు. కిష్టయ్య కుటుంబ సభ్యులైన భార్య నర్సవ్వ, కుమారుడు నర్సింలుతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కిష్టయ్య పలుమార్లు విక్రయదారుడితో చెప్పినా కాలయాపన చేశాడు. 2002లో విజేందర్రెడ్డి మృతి చెందాడు. విక్రయదారుడి భార్య అజిత బంధువులైన విజయ, విజేందర్రెడ్డితో కలిసి ఆదే భూమిని మిరుదొడ్డికి చెందిన బెక్కంటి దేవయ్య, బెక్కంటి మురళికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. ఏడు ఎకరాల భూమిని తాము కొనుగోలు చేశామంటూ దేవయ్య, మురళితో పాటు స్థిరాస్తి వ్యాపారులు దొమ్మాటకు చెందిన డప్పు శివరాజం, వెంకటాపురానికి చెందిన దయాకర్, నందు, మిరుదొడ్డికి చెందిన కుమార్, మేడ్చల్కు చెందిన రామేశ్వర్, హైదరాబాద్కు చెందిన మర్పడగ రవీందర్రెడ్డి కాస్తులో ఉన్న కిష్టయ్య కుటుంబ సభ్యులను భూమిలోంచి వెళ్లగొట్టారు. బోరుబావి, మోటారు ధ్వంసం చేశారు. భూమిలోంచి వెళ్లకుంటే చంపుతామని బెదిరించారు. ఈ నెల 17న వ్యవసాయ క్షేత్రంలో వృద్ధుడు రసాయన గుళికలు మింగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కుమారుడు నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు..
చేర్యాల: ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కుంగిపోయిన రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చేర్యాల మండలం చిట్యాలలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. చిట్యాలకు చెందిన గీకురు కనకయ్య(52) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న రెండు ఎకరాలకు తోడు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది అతివృష్టి కారణంగా పంట దిగుబడి రాక అప్పుల పాలయ్యాడు. కూతురు, కుమారుడి పెళ్లిళ్లకు చేసిన ఖర్చులు, సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో కొన్నాళ్లుగా మానసికంగా వేదన చెందుతున్నాడని గ్రామస్థులు చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఈ విషయమై ఎస్సై భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. ఫిర్యాదు అందలేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
పార్టీ శ్రేణులతో అభ్యర్థుల అంతర్గత సమావేశాలు -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!