జాతర ఘనం.. సౌకర్యాలు అధమం!
మల్లన్న సన్నిధికి వచ్చిన భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మార్పు చూపిస్తామని, సౌకర్యాలు కల్పిస్తామన్న ఆలయ అధికారులు, పాలకవర్గం మాటలు నీటి మూటలయ్యాయి.
మల్లన్న సన్నిధిలో భక్తుల వెతలు
న్యూస్టుడే, చేర్యాల
కొమురవెల్లి నుంచి రాజీవ్ రహదారి వైపు ఇలా..
మల్లన్న సన్నిధికి వచ్చిన భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మార్పు చూపిస్తామని, సౌకర్యాలు కల్పిస్తామన్న ఆలయ అధికారులు, పాలకవర్గం మాటలు నీటి మూటలయ్యాయి. ఏటా రూ.18 కోట్లకుపైగా ఆదాయం సమకూరే ఆలయం చెంతన మౌలిక వసతులు కరవయ్యాయి. వచ్చే ఉగాది వరకు జాతర కొనసాగనుండగా.. రాష్ట్రంలోని నలు మూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. ఈ మూడు నెలల్లోనే పాతిక లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ స్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం విఫలమైంది. ప్రధాన రహదారుల నిర్మాణం, నీటి సరఫరా, మురుగు పారుదల వ్యవస్థ, ధర్మగుండం నిర్వహణ తదితర సమస్యల విషయంలో తలెత్తిన లోపాల్ని అధికార గణం సరిద్దిలేకపోయింది. కొమురవెల్లి-రాజీవ్ రహదారి మధ్యనున్న 3 కిలోమీటర్ల రహదారి అధ్వానంగా మారింది. ఇరుకైన దారికి ఇరువైపులా, రోడ్డుపై గుంతల్లో ఇటీవల మట్టి పోశారు. ఆ మట్టి దుమ్ముతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
మురుగు తీరు..
మెరుగవని పారిశుద్ధ్య నిర్వహణ
మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో రహదారులు బురదమయంగా మారుతున్నాయి. స్థానిక పోలీసు స్టేషన్ ఎదురుగా భూగర్భ కాలువ మ్యాన్హోల్ నుంచి మురుగు బయటకు వస్తోంది. ఆలయం ముందున్న ప్రధాన రహదారి, ఆలయ రాజగోపురం నుంచి కల్యాణ వేదిక వద్దకు వెళ్లే ప్రధాన దారిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. స్వామివారికి, రేణుకా ఎల్లమ్మతల్లికి నైవేద్యం సమర్పించేందుకు బోనాలతో వెళ్లే భక్తులు ఈ బురదలో నడవక లేక ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచాల్సిన అవసరం ఉంది.
స్నాన ఘట్టాల్లో కనిపించని నీటిధార
వ్యవసాయ బావులే దిక్కు
కొమురవెల్లికి వచ్చే భక్తులకు నీటి వసతి కల్పించడంలో ఆలయ వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఆలయ ప్రాంతంలో చాలా చోట్ల స్నానఘట్టాలు ఏర్పాటు చేసినప్పటికీ నీటి సరఫరా లేదు. దీంతో భక్తులు రోడ్డు వెంట ఉన్న వ్యవసాయ బావులను ఆశ్రయించక తప్పలేదు. ఇదే అదనుగా రైతులు నీటిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకున్నారు. ఆలయ పరిధిలో తాగునీటి కోసం నల్లాల కింద ఏర్పాటు చేసిన తొట్లలో మురుగు నిలిచి కంపు కొడుతున్నాయి. దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. భక్తులు దుకాణాల్లో రూ.20లీటర్ల నీటి డబ్బాకు రూ.40 చొప్పున చెల్లించి వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM