‘మువ్వన్నెల’ వేడుక.. ప్రగతి నివేదిక
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి బాటలో పయనించేలా కృషి చేస్తున్నామని అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్ పేర్కొన్నారు.
న్యూస్టుడే, మెదక్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి బాటలో పయనించేలా కృషి చేస్తున్నామని అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక సమీకృత కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వివిధ శాఖల ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
అన్నదాతలకు అండగా..
జిల్లాలో గత ఖరీఫ్లో 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 3.93 లక్షల టన్నుల ధాన్యం సేకరించి రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలిచాం. 91,379 మంది రైతులకు ధాన్యం డబ్బులు రూ.810.77 కోట్లను ఖాతాల్లో జమచేశాం. రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో రబీ సీజన్లో 2.34 లక్షల మందికి రూ.173.31 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశాం. వివిధ కారణాలతో మృతి చెందిన 323 మంది అన్నదాతల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.16.15 కోట్లు చెల్లించాం.
పేదలకు సహకారం
కల్యాణలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 3,255 మంది లబ్ధిదారులకు, షాదీముబారక్ పథకం కింద 185 మంది లబ్ధిదారులకు కలిపి మొత్తం రూ.34.33 కోట్లు ఇచ్చాం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు 6,693 స్వయం సహాయక సంఘాలకు రూ.413.52 కోట్ల రుణం అందించాం. ఆసరా ద్వారా 1,18,560 మంది లబ్ధిదారులకు ప్రతినెలా పింఛన్ అందిస్తున్నామని, ఇందుకు రూ.25.63 కోట్ల వ్యయం చేస్తున్నాం. దళితబంధులో తొలి విడత అర్హులైన 256 మందికి రూ.25.34 కోట్ల సాయం అందించాం.
సంబురంగా..
గణతంత్ర వేడుకలు సంబురంగా జరిగాయి. అదనపు పాలనాధికారిణి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులను సత్కరించారు. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. జిల్లా స్త్రీ,శిశుసంక్షేమశాఖ, మెప్మా, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమశాఖల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న నలుగురు దంపతులకు రూ.2.50 లక్షల చొప్పున డిపాజిట్ బాండ్లను అందజేశారు. మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాలకు రూ.11.92 కోట్ల రుణాల చెక్కును అదనపు పాలనాధికారులు సంఘాల మహిళలకు పంపిణీ చేశారు. జాతీయస్థాయి క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు పాలనాధికారి రమేశ్, ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు ఎస్పీ డా.బాలస్వామి, జిల్లా అధికారులు శ్రీనివాస్, విజయశేఖర్రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్రావు, రమేశ్కుమార్, సాయిబాబ, జయరాజ్, జెమ్లానాయక్, కమలాకర్, రాజిరెడ్డి, కృష్ణమూర్తి, నాగరాజు, నర్సయ్య, సుధాకర్, కేశురాం, విజయలక్ష్మి, ఆశాకుమారి, రజని, ఇందిర, బ్రహ్మాజీ, ఆర్డీవో సాయి రాం, డీఎస్పీ సైదులు, తహసీల్దార్ శ్రీనివాస్, పురపాలిక అధ్యక్షులు చంద్రపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రాగౌడ్ పాల్గొన్నారు.
24,172 మందికి కంటిపరీక్షలు
* రెండో విడత కంటివెలుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు 24,172 మందికి కంటిపరీక్షలు చేయగా, వారిలో 4,319 మందికి కళ్లాద్దాలు అందజేశాం. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెంచడం, మాతా, శిశు మరణాల నివారణకు అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకాలు అమలు చేస్తున్నాం.
* జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరిన్ని ఎకరాలకు సాగు నీరందించే ప్రక్రియ మొదలైంది. చిన్నశంకరంపేట కాలువ ద్వారా 19,452 ఎకరాలకు సాగునీరందించే పనులు పురోగతిలో ఉన్నాయి.
* పురపాలికల్లో అధునాతన సమీకృత మార్కెట్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తూప్రాన్ పట్టణంలో రూ.30 కోట్లతో నిర్మాణం పూర్తయింది. మెదక్, నర్సాపూర్, రామాయంపేట పట్టణాల్లో పనులు జరుగుతున్నాయి.
* మన ఊరు-మన బడి ద్వారా తొలివిడతగా 313 పాఠశాలలను ఎంపిక చేశాం. ఇందులో 311 పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు రూ.65 కోట్లతో అంచనాలు రూపొందించి, 258 పాఠశాలల్లో పనులు చేపట్టాం. పలు చోట్ల పూర్తయ్యాయి. 1,078 అంగన్వాడీ కేంద్రాల్లో, 11 చోట్ల ఆదర్శ కేంద్రాలుగా తీర్చిదిద్దే పనులు ప్రారంభమయ్యాయి.
* జిల్లాలో ధరణి ద్వారా 68,057 లావాదేవీలు జరిగాయి. టీఎస్-ఐపాస్ విధానంలో ఇప్పటి వరకు 759 పరిశ్రమలకు రూ.8,093 కోట్ల పెట్టుబడితో 25,354 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు