పాలకుల వైఫల్యాలు ప్రజలకు వివరించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ ఆరోపించారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ
సమావేశంలో మాట్లాడుతున్న రాజనర్సింహ, నాయకులు
సంగారెడ్డి అర్బన్, న్యూస్టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ ఆరోపించారు. గురువారం సంగారెడ్డిలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి అధ్యక్షతన జరగగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులకు రుణమాఫీ, దళితులకు సీఎం పదవి, దళితులకు మూడెకరాల భూమి, అందరికీ దళిత బంధు, రెండు పడక గదుల ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.10లక్షల వరకు రుణాలు ఇస్తామన్న కేసీఆర్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జన్దన్ ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని భాజపా హామీ ఇచ్చిందని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదలపై భారం మోపుతోందని విమర్శించారు. వచ్చేనెల 6 నుంచి నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఇంటింటికీ వెళ్లి పాలకుల వైఫలాల్యలను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్ నేతలు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం..
జహీరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని, దీంతో ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారని మాజీ మంత్రి జె.గీతారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు కొనసాగనున్న హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని గురువారం జహీరాబాద్ శివారులోని గుల్షన్నగర్, మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామాల్లో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమన్నారు. వివిధ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీపీ గిరిధర్రెడ్డి, పార్టీ జహీరాబాద్ పట్టణం, మండలం, మొగుడంపల్లి మండల అధ్యక్షులు కండెం నర్సింహులు, నర్సింహారెడ్డి, మహ్మద్ మక్సూద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్లో గీతారెడ్డి తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM