ప్రగతి సంకల్పం ప్రణాళికతో సాకారం
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. సంక్షేమ పథకాల సద్వినియోగంతో ప్రయోజనం చేకూరుతోంది.
ఈనాడు, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. సంక్షేమ పథకాల సద్వినియోగంతో ప్రయోజనం చేకూరుతోంది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతుండటం కలిసి వస్తోంది. పలు అంశాల్లో ప్రగతి సాధించి మేటిగా నిలవగా, మరికొన్నింట మాత్రం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. కీలక అంశాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు ప్రణాళిక అవశ్యం. తాజాగా 2021-22 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర అర్థగణాంక శాఖ విడుదల చేసిన నివేదిక ఆయా విషయాలను స్పష్టంచేస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాలోని పరిస్థితిపై ప్రత్యేక కథనం.
దూసుకెళ్తున్నాయ్..
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. సంప్రదాయ ఇంధన వనరులు భారంగా మారుతుండటంతో ఈ దిశగా అడుగులు పడ్డాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో పలు సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ముమ్మరం చేశాయి. పనితీరు బాగుండటంతో వినియోగం పెరుగుతోంది.
మెతుకుసీమలోనే ఎక్కువ..
శాతాల్లో ఇలా..
నాలుగు జిల్లాల్లో పరిశీలిస్తే సంగారెడ్డి జిల్లాలోనే పట్టణ జనాభా ఎక్కువ. మెదక్ జిల్లాలో పల్లెల్లోనే అత్యధికులు జీవిస్తున్నారు. రాష్ట్రంలోనే 7.7 శాతం పట్టణ జనాభాతో మెదక్ జిల్లా పట్టణ జనాభా తక్కువగా ఉన్న జిల్లాల్లో మూడోస్థానంలో నిలిచింది.
బీమా ప్రయోజనం
రైతులు మరణిస్తే బాధిత కుటుంబాలకు అందిస్తున్న బీమా ఆసరాగా నిలుస్తోంది. రూ.5 లక్షల మేర సాయం అందుతోంది. ఇప్పటి వరకు నాలుగు జిల్లాల్లో కలిపి ఈ పథకం ద్వారా 17,143 కుటుంబాలకు ప్రయోజనం దక్కింది. బీమా క్లెయిమ్లు ఇలా..
బడి మానేస్తున్నారు..
ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతులతో పోలిస్తే హైస్కూల్కు వచ్చేసరికి ఎక్కువ మంది విద్యకు దూరమవుతున్నారు. తొమ్మిదో, పదో తరగతులకు వచ్చేసరిగా చదువు మానేస్తున్నారని గుర్తించారు. ఆయా జిల్లాలో ఇలా..
రవాణా వసతి
స్వరాష్ట్రం వచ్చాక రహదారుల బాగుపై ప్రధానంగా దృష్టిసారించారు. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వచ్చే దారులను విస్తరించారు. కొత్తగా తారురోడ్లు నిర్మించారు. ఇందులో సిద్దిపేట ముందంజంలో ఉంది. నాలుగు జిల్లాల్లో పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖకు సంబంధించి మొత్తం 14,887.49 కి.మీ. పొడవున రోడ్లున్నాయి.
పెట్టుబడి సాయం..
రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందుతోంది. తద్వారా సాగుకు ప్రైవేటు అప్పు బాధలు తప్పాయి. రాష్ట్రంలో సంగారెడ్డి రెండోస్థానంలో ఉంది. సిద్దిపేట (5), వికారాబాద్ (10), మెదక్ (11) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
తలసరి ఆదాయం..
ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండటంతో తలసరి ఆదాయం పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి మెరుగైన మూడు, సిద్దిపేట, మెదక్ జిల్లాలు రాష్ట్రస్థాయిలో వరుసగా 5, 6 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక వికారాబాద్ కింది నుంచి మూడింట నిలిచింది.
ఆందోళనకరంగా..
తీవ్రమైన పోషకాహారలోపంతో బాధపడుతున్న చిన్నారులు రాష్ట్రంలోనే మెదక్ జిల్లాలో అత్యధికులు ఉన్నారు. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. సంక్షేమ శాఖల అధికారులు ఈ విషయమై ప్రత్యేక దృష్టిసారిస్తే మేలు. పోషకాహార లోపమున్న వారి శాతం ఇలా..
రొయ్యల ఉత్పత్తిలో..
మిషన్ కాకతీయ ద్వారా నీటి వనరులను పునరుద్ధరించడంతో జలకళను సంతరించుకున్నాయి. కొత్త జలాశయాలు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి పెరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.