పోటీ అధికం.. కేటాయింపు స్వల్పం
జిల్లాలో పాపన్నపేట అతిపెద్ద మండలం. మైనార్టీలు 3,542 మంది ఉన్నారు. కేటగిరీ-1లో మూడు, కేటగిరీ-2లో ఒక యూనిట్ మాత్రమే కేటాయించారు.
56 యూనిట్లకు 2,239 దరఖాస్తులు
రామాయంపేట మండల పరిషత్తు కార్యాలయంలో ముఖాముఖి
* జిల్లాలో పాపన్నపేట అతిపెద్ద మండలం. మైనార్టీలు 3,542 మంది ఉన్నారు. కేటగిరీ-1లో మూడు, కేటగిరీ-2లో ఒక యూనిట్ మాత్రమే కేటాయించారు. మొత్తం 145 దరఖాస్తులు వచ్చాయి. యూనిట్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ సదరు వర్గీయులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
* జిల్లా కేంద్రం మెదక్లో 32 వార్డులు ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా 9,618 మంది మైనార్టీలు ఉండగా, కేటగిరీ-1లో ఏడు, కేటగిరీ-2లో రెండు యూనిట్లే ఇచ్చారు. 396 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో అత్యధిక అర్జీలు వచ్చింది ఇక్కడే గమనార్హం. ముఖాముఖిలు ఈనెల 27, 30 తేదీల్లో నిర్వహిస్తామని అధికారులు ప్రకటించి, ఆ తర్వాత రద్దు చేశారు.
న్యూస్టుడే, మెదక్, పాపన్నపేట
జిల్లాలో మైనార్టీ కార్పొరేషన్ రుణాల లబ్ధిదారుల ఎంపిక గందరగోళంగా మారింది. యూనిట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో వాటిని పెంచాలని ఆందోళనకు దిగుతున్నారు. ఏడేళ్ల తర్వాత కేటాయించడంతో నిరుద్యోగ యువత భారీగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తమకు బ్యాంకు రుణం అందుతుందా లేదా అన్న భావన నెలకొంది. వాటి సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏడేళ్ల తర్వాత..
జిల్లాలో మైనార్టీల జనాభా 51,318. ఆయా సంక్షేమ శాఖల ద్వారా ప్రభుత్వం స్వయం ఉపాధి నిమిత్తం బ్యాంకు రుణాలు అందజేస్తోంది. 2016-17లో అల్పసంఖ్యాకవర్గాల సంక్షేమ శాఖ ద్వారా యూనిట్లు మంజూరైతే.. తిరిగి 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయించారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేని యువత స్వయం ఉపాధికి వ్యాపారాలు చేస్తుంటారు. వారికి రాయితీ రుణాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇటీవల మైనార్టీ సంక్షేమశాఖ జిల్లాకు యూనిట్లను కేటాయించింది. కేటగిరీ-1లో రూ.లక్షకు 39, కేటగిరీ-2లో రూ.2 లక్షలకు 17 యూనిట్లు మంజూరు చేశారు. కేటగిరీ-1లో రూ.80 వేలు రాయితీ, రూ.20 వేలు బ్యాంకు రుణం, కేటగిరీ-2లో రూ.1.40 లక్షలు రాయితీ, రూ.60 వేలు బ్యాంకు రుణం అందజేయాలని ఉత్తర్వులు ఇచ్చారు ముస్లింలు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, పార్శిలకూ రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.
దరఖాస్తుల వెల్లువ..
రెండు విభాగాలలో కలిపి మొత్తం 56 యూనిట్లకు 2,239 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట పురపాలికలకు కేవలం 19 యూనిట్లు కేటాయించగా.. 633 అర్జీలు వచ్చాయి. హవేలి ఘనపూర్, మెదక్, చిలప్చెడ్, మనోహరాబాద్, నర్సాపూర్, తూప్రాన్, రేగోడ్, రామాయంపేట మండలాలకు ఒక్కోటి మాత్రమే మంజూరైంది. 35 శాతం మహిళలకు, 5శాతం దివ్యాంగులకు, నిరుపేదలు, ఎలాంటి ఆధారం లేని మహిళలు, గతంలో కార్పొరేషన్ రుణం తీసుకోని వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలన్న ఆదేశాలున్నాయి. ఇప్పటికే పలు మండలాల్లో ముఖాముఖిలు సైతం పూర్తిచేశారు. ఈనెలాఖరు వరకు సదరు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలుండగా ఇంకా చాలాచోట్ల చేయాల్సి ఉంది. తక్కువగా యూనిట్లు మంజూరు చేయడంతో ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక కత్తిమీత సాముగాగా మారింది. మరోవైపు తమ అనుయాయులకు మంజూరుచేయాలని ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వం స్పందించాలి
స్వయం ఉపాధికి మైనారిటీ కార్పొరేషన్ రుణానికి దరఖాస్తు చేసుకున్నా. మండలానికి నాలుగు యూనిట్లు కేటాయించారు. 119 మంది ముందుకొచ్చారు. వీరిలో సగం మందికైనా కేటాయిస్తే బాగుంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలి.
- హైమద్అలీ, పాపన్నపేట
మార్గదర్శకాల మేరకు ఎంపిక
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపిక చేపడతాం. ఈనెల 30 వరకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు అర్హుల జాబితా పంపాలి. వాటిని పరిశీలించి తుది జాబితా రూపొందిస్తాం. అదనపు పాలనాధికారి ఆదేశాల మేరకు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటాం.
- జెమ్లానాయక్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!