సమస్యల వలయంలో వసతిగృహం
తాగునీరు లేక అవస్థలు.. ఉన్న ఫ్యాన్లు సరిగా పని చేయవు.. దోమలతో సహవాసం.. ఇక భోజనం అంతంతే.. ఇలా వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు హవేలిఘనపూర్ మండలం బూర్గుపల్లి బీసీ వసతిగృహ విద్యార్థులు.
న్యూస్టుడే, హవేలిఘనపూర్
రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు
తాగునీరు లేక అవస్థలు.. ఉన్న ఫ్యాన్లు సరిగా పని చేయవు.. దోమలతో సహవాసం.. ఇక భోజనం అంతంతే.. ఇలా వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు హవేలిఘనపూర్ మండలం బూర్గుపల్లి బీసీ వసతిగృహ విద్యార్థులు. ఆయా వాటి పరిష్కారానికి ఆందోళన బాట పట్టడం గమనార్హం.
80 మంది విద్యార్థులు.. : బూర్గుపల్లి వసతిగృహంలో 80 మంది ఉంటున్నారు. సమస్యలతో సహవాసం చేస్తూ వసతి పొందుతున్నారు. తాగునీరు కరవై ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు నిద్రించే గదుల్లో ఫ్యాన్లు సరిగా పని చేయడం లేదు. భవనం చుట్టూ అపరిశుభ్రత ఉండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంది. ట్యాంకులకు సరైన కప్పులు లేకపోవడంతో చెత్తాచెదారం వాటిలో పడి కలుషితం అవుతున్నాయి. ఆ నీటినే తాగాల్సి వస్తోందని పిల్లలు వాపోతున్నారు. ఆ నీటితోనే స్నానం చేయాల్సి వస్తుండటంతో శరీరంపై దద్దుర్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టిక పాటించకుండా..
వసతిగృహంలో పక్కాగా భోజనం అందించేందుకు ప్రభుత్వం ఓ పట్టికను నిర్దేశించింది. ఇక్కడ మాత్రం దాన్ని పాటించడం లేదని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 శౌచాలయాలకు మూడు మాత్రమే పని చేస్తుండటంతో అత్యవసర వేళ నానాపాట్లు పడాల్సి వస్తోంది. ఆవరణలోకి పశువులు వచ్చి అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. వీటితో విసిగిపోయిన విద్యార్థులు శనివారం బూర్గుపల్లి నుంచి గాజిరెడ్డిపల్లికి వెళ్లే మార్గంలో భైఠాయించి ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని, వసతిగృహ అధికారి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం తాగి విధులకు హాజరవుతున్నాడని, విధుల నుంచి తొలగించాలన్నారు. ఎస్ఐఫ్ఐ ఆధ్వర్యంలో గంటన్నర పాటు ధర్నా కొనసాగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, హవేలిఘనపూర్ తహసీల్దారు నవీన్కుమార్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అసిస్టెంట్ అధికారి నాగరాజుగౌడ్ అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. ఇబ్బందులు తీరుస్తామని హామీ ఇచ్చి శాంతింపజేశారు. అనంతరం జిల్లా బీసీ సంక్షేమాధికారి కేశురాం వసతిగృహాన్ని పరిశీలించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా