క్రీడా మైదానాలకు రక్షణేది?
విద్యార్థులు, యువత ఆటల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఊరూరా క్రీడా మైదానాలను ఏర్పాటు చేసింది.
కబ్జాకు గురవుతున్నా చర్యలు కరవు
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, జోగిపేట, కోహిర్, మునిపల్లి
పోసానిపేటలో స్థలం చుట్టూ వేసిన కంచె
విద్యార్థులు, యువత ఆటల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఊరూరా క్రీడా మైదానాలను ఏర్పాటు చేసింది. వాటిపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. హద్దులు చెరిపేస్తూ.. పక్కనున్న స్థలాల్లో కలిపేసుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల కంచెలు వేయడం, కడీలు పాతడం, షెడ్లు వేయడం లాంటివి చేస్తున్నారు. ఇటీవల చౌటకూరు మండలం శివ్వంపేటలో ప్రభుత్వ బడికి చెందిన ఆట స్థలాన్ని రక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో కథనం.
క్షేత్ర స్థాయి పరిస్థితి..
అందోలు మండల పరిధి పోసానిపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన క్రీడా మైదానాన్ని ఇటీవల ఓ వ్యక్తి కబ్జాకు చేశాడు. రహదారికి సమీపంలోనే ఉండటం వల్ల ఆ స్థలం అత్యంత ఖరీదైనది. ఇక్కడ సుమారు పావు ఎకరా వరకు పరాధీనమైనట్టు స్థానికులు తెలిపారు. స్థానిక ఓ వర్గం వారు ఆక్రమణను అడ్డుకోగా.. మరొక వర్గం ఆక్రమణదారుకు మద్దతు పలుకుతోంది.
కోహిర్ మండలం గుర్జువాడ జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం ఎకరా 3 గుంటల వరకు ఉంది. చుట్టుపక్కల వారు అర ఎకరం వరకు ఆక్రమించుకున్నారు. సర్వే చేసి హద్దులు చూపాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.
మునిపల్లి మండలంలోని అంతారం ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని క్రీడా మైదానం కొంత భాగం కబ్జాకు గురైంది. అందులో ఓ వ్యక్తి ఇంటిని నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు.
జోగిపేట పట్టణంలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మైదానానికి ఓ మూలన తొలుత కొందరు గుడిసెలు నిర్మించుకున్నారు. ఆ తర్వాత పక్కా ఇళ్లు నిర్మిస్తున్నారు. అధికారులు సర్వే చేస్తే.. ఆ స్థలం ఎంతమేరకు పరాధీనమైందో తేలుతుంది.
చౌటకూరు మండలంలోని శివ్వంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన కొంత స్థలం పరాధీనమైంది. ఆ స్థలాన్ని ఆక్రమణ చెర నుంచి విడిపించాలని గ్రామస్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఇటీవల ఆందోళనకు దిగారు. 161వ జాతీయ రహదారికి పక్కనే ఈ మైదానం ఉంది. ఇక్కడ ఎకరం రూ.కోట్లలో ధర పలుకుతుంది.
సమన్వయంతో వ్యవహరిస్తేనే..
జిల్లాలోని కొన్ని చోట్ల పాఠశాలల్లోని క్రీడా మైదానాలు ఆక్రమణకు గురవుతున్నాయి. వెంటనే స్థానిక పాలక వర్గాలు వాటి రక్షణకు చర్యలు చేపట్టాలి. రాజకీయ నేతల ప్రమేయం, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, విద్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడం సమస్యగా మారిందనే ఆరోపణలున్నాయి. విద్యా కమిటీ ప్రతినిధులు, స్థానిక సర్పంచి, వార్డు సభ్యులు సమన్వయంతో వ్యవహరిస్తే క్రీడా మైదానాలను రక్షించే అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు.
విచారించి చర్యలు తీసుకుంటాం..
- రాజేశ్, జిల్లా విద్యాశాఖాధికారి
ప్రభుత్వ పాఠశాలల క్రీడా మైదానాలు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ క్రీడా స్థలాలు పరాధీనమయ్యాయో.. ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోల ద్వారా నివేదికలు తెప్పించుకుంటాం. పూర్తి స్థాయిలో విచారించి... వాటిని కాపాడేందుకు కృషి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’