ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: సీపీ
ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించాలని పోలీసు సిబ్బందికి సీపీ శ్వేత సూచించారు. సిద్దిపేట గ్రామీణ ఠాణాను శనివారం ఆమె సందర్శించారు.
పోలీసు ఠాణాను పరిశీలిస్తున్న శ్వేత
సిద్దిపేట అర్బన్, న్యూస్టుడే: ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించాలని పోలీసు సిబ్బందికి సీపీ శ్వేత సూచించారు. సిద్దిపేట గ్రామీణ ఠాణాను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఠాణా పరిసరాలను ఆహ్లాదకరంగా ఉంచాలని, రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని, విధి నిర్వహణలో సిబ్బంది పోటీపడి పనిచేయాలని సూచించారు. ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా మాట్లాడి సాధక బాధకాలను విన్న తర్వాత వారు ఇచ్చే దరఖాస్తుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీపీ వెంట డీసీపీ మహేందర్, ఏసీపీ దేవారెడ్డి, సీఐ జానకిరాంరెడ్డి, ఎస్ఐ కిరణ్రెడ్డి సిబ్బంది ఉన్నారు.
సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి ప్రతీరోజు వ్యాయామం చేయాలని పోలీసు కమిషనర్ శ్వేత సూచించారు. క్రమం తప్పకుండా వాకింగ్, రన్నింగ్ చేయాలన్నారు. సమతుల్య ఆహారం తీసుకుంటూ శరీరానికి శ్రమ కల్పించాలన్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని 5కె, 10కె హాఫ్ మారథాన్, మారథాన్ పరుగుపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మారథాన్ శిక్షకుడు నిరంజన్ పరుగుకు సంబంధించిన మెలకువలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 8 వారాల పాటు రన్నింగ్ సాధన చేసిన తర్వాతే 5కె, 12 వారాల తర్వాత 10కె, 24 వారాల తర్వాత హాఫ్ మారథాన్, మారథాన్ సాధన చేయాలని సూచించారు. వారానికి నాలుగు రోజులు రన్నింగ్, మూడు రోజులు వాకింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ మహేందర్, డీసీపీలు రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, రమేశ్, ఫణిందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రఘుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో