నడివయసు.. తీరుతున్న ఆయుష్షు
ఇంటిపెద్దను కోల్పోయిన రైతు కుటుంబానికి అండగా నిలవాలన్నదే రైతు బీమా పథక ఉద్దేశం. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలోనే రూ.5 లక్షలు అందిస్తున్నారు.
అర్థగణాంక నివేదికలో వెల్లడి
బీమా పత్రం అందజేస్తూ..
ఈనాడు, సిద్దిపేట: ఇంటిపెద్దను కోల్పోయిన రైతు కుటుంబానికి అండగా నిలవాలన్నదే రైతు బీమా పథక ఉద్దేశం. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలోనే రూ.5 లక్షలు అందిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర అర్థగణాంక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరింది. దీన్ని పరిశీలిస్తే 49 నుంచి 59 ఏళ్ల లోపున్న వారు అధికంగా మృతి చెందినట్లు తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో దీనికి కారణాలు, తదితర అంశాలపై ‘ఈనాడు’ అందిస్తున్న కథనం.
వివిధ కారణాలు..
కనీసం గుంట భూమి ఉండి ఆన్లైన్లో వివరాలు నమోదై ఉన్న వారు రైతు బీమాకు అర్హులు. 18 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న వారు చనిపోతే వారి కుటుంబానికి ప్రయోజనం దక్కుతుంది. సంబంధిత ధ్రువపత్రాలను స్థానిక ఏఈవోకు అందిస్తే ఆన్లైన్లో సమాచారాన్ని పొందుపరిచి, ధ్రువపత్రాలు జతచేస్తారు. మంత్రి హరీశ్రావు సూచన మేరకు ఏ కారణంతో చనిపోయారనే విషయాన్ని సైతం నమోదు చేస్తున్నారు. ఎక్కువ మంది అనారోగ్య కారణాలతో పాటు కుటుంబ కలహాలు, ఇతరత్రా సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సదరు గణాంకాలు తేల్చాయి. రోడ్డు ప్రమాదాలు, విద్యుదాఘాతాలు, ఇతర కారణాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
వీళ్లే అధికంగా..
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో పరిశీలిస్తే 49-59 ఏళ్లున్న వారే అధికంగా మరణించినట్లు స్పష్టమవుతోంది. 59 ఏళ్లు పైబడిన వారు చనిపోతే బీమా వర్తించదు. దీంతో ఆయా వివరాలు అధికారులు సేకరించడం లేదు. 2018-19 నుంచి 2021-22 వరకు ఈ నాలుగు జిల్లాల పరిధిలో 17,143 మందికి బీమా ప్రయోజనం దక్కగా.. అందులో 49-59 ఏళ్ల వయసున్న వారు 8,057 ఉన్నారు.
కౌలు రైతులకు దక్కక..
కనీసం గుంట భూమి ఉన్నా ప్రయోజనం దక్కుతోంది. కౌలుదారులకు మాత్రం ఊరట దక్కడం లేదు. వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకం ద్వారా తమకు ఒక్క రూపాయి కూడా లాభం ఉండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో కౌలు రైతుల సంఖ్యే అధికంగా ఉంటోంది. అయితే వారి కుటుంబానికి భరోసా దక్కడం లేదు. ఇకనైనా ప్రభుత్వం దీనిపై దృష్టిసారిస్తే మేలు.
కుమార్తె పెద్ద దిక్కయి..
న్యూస్టుడే, మెదక్, వెల్దుర్తి: వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్కు చెందిన శ్రీశైలానికి 28 గుంటల భూమి ఉంది. నాలుగేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త అకాల మరణంతో దు:ఖాన్ని దిగమింగుకొని నలుగురు పిల్లలను చదివిస్తుండగా మమత సైతం చనిపోయారు. దీంతో తల్లిదండ్రులు కోల్పోయిన నలుగురు పిల్లలు అనాథలయ్యారు. పెద్ద కుమార్తె కీర్తన 8వ తరగతితో చదువు ఆపేసి, ప్రస్తుతం కుట్టుశిక్షణ పొందుతోంది. ఆమె చెల్లెలు హారిక వెల్దుర్తి కస్తూర్బాలో, తమ్ముళ్లు సాయి రక్షిత్, సాయిప్రణీత్ నర్సాపూర్లోని ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోని బడిలో చదువుకుంటున్నారు. కీర్తన వారి బాధ్యతలను చూసుకుంటున్నారు. రైతుబీమా ద్వారా రూ.5 లక్షలు రాగా వాటిని పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.
వివరాల సేకరణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!