ఇక వేగంగా.. ఆదాయం పెంచేలా..
ఆర్టీసీ.. నష్టాలను అధిగమించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది.
మెదక్లోని లాజిస్టిక్స్ కేంద్రం
న్యూస్టుడే, మెదక్ అర్బన్: ఆర్టీసీ.. నష్టాలను అధిగమించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ప్రయణికుల మన్ననలు పొందేందుకు పలు రాయితీలకు సైతం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2020 జూన్ 19న కార్గో, కొరియర్ సేవలను ప్రారంభించింది. సదరు సేవలపై విస్తృతంగా ప్రచారం చేయడంతో అత్యధికులు వినియోగించుకుంటున్నారు. తద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతోంది. సరకుల రవాణా సేవలను ఆర్టీసీ ప్రారంభించడంతో సత్ఫలితాలు వచ్చాయి. ఆదాయ అన్వేషణలో భాగంగా ఏర్పాటు చేసిన కార్గో సర్వీసును మరింత అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు.
దేశవ్యాప్తంగా..
కార్గో సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు లాజిస్టిక్స్గా పేరు మార్చారు. మెదక్ రీజియన్ పరిధిలో మొత్తం 8, వికారాబాద్ జిల్లాలో మూడు డిపోలు ఉన్నాయి. ఓ వైపు ప్రయాణికులను చేరవేస్తూనే, మరోవైపు సరకులను వినియోగదారుల వద్దకు చేరుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 19 చోట్ల బుకింగ్ కేంద్రాలను నెలకొల్పారు.
కిలో లోపే..
కొత్త సేవల్లో భాగంగా పంపించే పార్సిల్ బరువు కిలోకు మించకుండా ఉండాలి. దీని విలువ రూ.5 వేలకు మించకూడదు. ఇటు పంపించే వారికి, అటు తీసుకునే వారికి సంక్షిప్త సందేశాలు అందుతాయి. ఇతర రాష్ట్రానిల్లోని నగరాలకు ఐదు కిలోల బరువున్నవి రవాణా చేయనున్నారు.
నూతన సేవలు..
తాజాగా పార్సిళ్లను సత్వరమే రవాణా చేసేందుకు ‘ఏఎం టు పీఎం’ పేరిట నూతన సేవలను సంస్థ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. రూ.99కే పంపించేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 12 గంటల్లోపు బుక్ చేస్తే రాత్రి 9 గంటలకు, రాత్రి 9 గంటల్లోపు అయితే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు గమ్యస్థానానికి చేరవేయనున్నారు. ప్రస్తుతం సిద్దిపేట డిపోలో సదరు సేవలు షురూ చేశారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సత్వర పార్సిల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
సద్వినియోగం చేసుకోండి
సుదర్శన్, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్, మెదక్
వినియోగదారులకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా ఏఎం టు పీఎం సేవలను పరిచయం చేస్తున్నాం. తద్వారా పార్సిల్ బుక్ చేసిన తర్వాత గరిష్ఠంగా 9 గంటల్లోపు గమ్యస్థానానికి చేరుస్తాం. పార్సిల్పై పక్కా పర్యవేక్షణ ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్టీసీని ఆదరించాలి. వేగంగా గమ్యాలకు చేరవేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?