వాయు కాలుష్యం.. జనం ఉక్కిరిబిక్కిరి..
మండల పరిధి గడ్డపోతారం పారిశ్రామికవాడలోని పలు రసాయన పరిశ్రమల తీరు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
గడ్డపోతారం పారిశ్రామికవాడలో కట్టడికి చర్యలు కరవు
న్యూస్టుడే, జిన్నారం: మండల పరిధి గడ్డపోతారం పారిశ్రామికవాడలోని పలు రసాయన పరిశ్రమల తీరు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గాలిలో రసాయన రేణువులు 0.250 ఉన్నట్టు సూచీలు సూచిస్తుండగా.. దీన్ని అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. ఘాటు వాసనతో కళ్లు తిరగడం, వాంతులు చేసుకోవడం లాంటి ఇబ్బందులు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. కాలుష్య నివారణకు చేపట్టాల్సిన చర్యలు కానరాకపోవడం, పీసీబీ అధికారులు పట్టించుకోక పోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి ప్రాంతాల్లో ఇటీవల ఈ సమస్య అధిగమైన తీరుపై కథనం.
ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు..
పారిశ్రామికవాడలో ఉష్ణోగ్రతలు పడిపోయి.. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దయనీయ పరిస్థితులుంటున్నాయి. రసాయన, మురుగు, ఘాటు వాసనలు అధికమవుతున్నాయి. వారం, పది రోజులుగా ఈ సమస్య తీవ్రమైంది. కాలుష్య కట్టడికి చాలా పరిశ్రమలు స్క్రబ్బర్లు మార్చడం లేదు. ఫిల్టర్ కాకుండానే ఉత్పత్తుల ద్వారా వచ్చే రసాయన జలాలు, వాయువులను వదులుతున్నారు. ఫోర్స్డ్ ఎవాపరేషన్ విధానంలో నియంత్రించే అవకాశమున్నా.. నిబంధనలు పాటించడం లేదు. ఈ సమస్యను గుర్తించడానికి ప్రతి పరిశ్రమ ఎదుట ఎలక్ట్రానిక్ పరికరాలను అమర్చారు. కాలుష్య వివరాలు డిస్ప్లే అవుతాయి. వాటిని పీసీబీ కార్యాలయానికి అనుసంధానించారు. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో కాలుష్య నియంత్రణ చర్యలు కరవయ్యాయి.
ఇళ్లలో ఉండలేకపోతున్నాం: పావని, చెట్లపోతారం
పరిశ్రమల వల్ల ప్రతి రోజు నరకం అనుభవిస్తున్నాం. తీవ్ర వాయు కాలుష్యం ఇబ్బంది పెడుతోంది. రేయింబవళ్లు ఇదే పరిస్థితి ఉంటోంది. చలికాలంలో తీవ్రమైంది. కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలి.
ఎవరూ పట్టించుకోవడం లేదు: గణేశ్, గడ్డపోతారం
సమస్య ఏళ్లుగా కొనసాగుతోంది. విషవాయువుల తాకిడికి ఊళ్లో ఉండలేని పరిస్థితి. ప్రత్యామ్నాయం లేక ఇక్కడే ఉండక తప్పడం లేదు. అధికారులకు సమస్య విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఇకనైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి.
వెంటనే స్పందిస్తున్నాం..: కుమార్పాఠక్, పీసీబీ ఈఈ, రామచంద్రాపురం
సమస్యను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్పందిస్తున్నాం. మూడు రోజు క్రితం మా బృందం వెళ్లి పరిశీలన చేసింది. నిఘాతో కాలుష్య కారకులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు