జీవనోపాధి.. సౌకర్యానికి వారధి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి భరోసా కల్పిస్తోంది.
‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’లో రూ.18.17 కోట్లు వ్యయం
సంఘాల్లో కొత్త సభ్యత్వాలకు శ్రీకారం
మూడేళ్ల క్రితం మత్స్యకారులకు వాహనాలను అందజేసిన ఎంపీ, ఎమ్మెల్సీ, నాయకులు
న్యూస్టుడే, సిద్దిపేట అర్బన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి భరోసా కల్పిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మత్స్యకారులకు ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ ప్రవేశపెట్టి అమలు చేసింది. పథకం అమలులో భాగంగా రాయితీపై మోటారు సైకిళ్లు, ప్లాస్టిక్ చేపల కిట్లు, వలలు, తెప్పలు, సంచార చేపల విక్రయ వాహనాలను, మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యానికి నిధులు మంజూరు చేసి జీవనోపాధి పొందేలా తగు చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాయితీ కింద వాహనాలు, ఇతర సామగ్రి కోసం రూ.18.17 కోట్లు పైగా ఖర్చు చేశారు. కొత్తగా సభ్యత్వం పూర్తయితే మరింతమందికి ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 284 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 20 వేలకు పైగా సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం అర్హులైన వారికి సంఘాల్లో సభ్యత్వం ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. నూతన సభ్యత్వాలు అందజేస్తే జిల్లాలో మత్స్యకార్మికుల సంఖ్య మరింత పెరగనుంది. బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం చెల్లిస్తున్నారు. ప్రాజెక్టుల ద్వారా కాళేశ్వరం నీటితో జిల్లాలోని 1306 చెరువులు, కుంటలను నింపడంతో కళకళలాడుతున్నాయి. ఉచితంగా చేప పిల్లలను చెరువులో వదులుతోంది. అవి పెరిగిన తర్వాత గ్రామాల్లోని సంఘాల నేతృత్వంలో ఏడాది పొడవునా పట్టుకొని వాటిని మార్కెట్లో విక్రయించి ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. మత్స్య సహకార సంఘాల్లో ఇప్పటివరకు కొత్తగా 973 మంది దరఖాస్తు చేసుకున్నారని పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. కొత్తవారికి ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
రాయితీపై పంపిణీ చేసిన ద్విచక్ర వాహనాలు
ముందుగా దరఖాస్తు చేసుకోవాలి
మల్లేశం, జిల్లా మత్స్యశాఖ అధికారి
అర్హులైన మత్స్యకారులు సంఘం సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు చేపట్టాం. ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ ప్రవేశపెట్టి అర్హులైన వారికి రాయితీపై వాహనాలు, కిట్లు, మహిళలకు ఆర్థిక సాయం చేస్తారు. బీమా సౌకర్యం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ