మనస్తాపంతో యువకుడి బలవన్మరణం
మానసిక ఆందోళనతో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు చేసుకున్నట్లు చిరాగ్పల్లి ఏఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
జహీరాబాద్ అర్బన్, న్యూస్టుడే: మానసిక ఆందోళనతో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు చేసుకున్నట్లు చిరాగ్పల్లి ఏఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మొగుడంపల్లి మండలం గొడిగార్పల్లి గ్రామానికి చెందిన దండు రాహుల్(22) కొన్నాళ్లుగా మానసికంగా ఆందోళన చెందుతూ ఒంటిరిగా ఉంటున్నట్లు చెప్పారు. శనివారం సాయంత్రం ఇంటి పరిసరాల్లోని షెడ్డులో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతదేహాన్ని జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిలో శవపరీక్ష అనంతరం కుటుంబీకులు అప్పగించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.
రైలు కిందపడి..
కోహీర్, న్యూస్టుడే: రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ రైల్వే గేటు సమీపం 42/5 మైలురాయి వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... కోహీర్ పట్టణం భీంనగర్కాలనీకి చెందిన తలారి శ్రీనివాస్(30) పటాన్చెరు విద్యుత్తు ఉప కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో స్థిరాస్తి వ్యాపారి..
దుండిగల్(హైదరాబాద్), న్యూస్టుడే: ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఓ స్థిరాస్తి వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా మగ్థభూపతిపూర్ గ్రామానికి చెందిన భాస్కర్రావు కుమారుడు కిషోర్కుమార్ (34) కుటుంబ సభ్యులతో కలిసి గత కొంతకాలంగా బౌరంపేటలోని సింహపురికాలనీలో నివాసముంటున్నాడు. అతను స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం స్వస్థలంలో బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. తర్వాత తను ఒక్కడే శనివారం ఇంటికి తిరిగి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం అతనిని కలిసేందుకు స్థానికంగా ఉండే స్నేహితుడు శ్రీకాంత్ వారి అపార్ట్మెంట్కు వెళ్లాడు. ఈ క్రమంలో ఇంటి తలుపులు తీయకపోవడంతో కిటికిలో నుంచి చూడగా కిష్రో్కుమార్ ఫ్యాన్కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు బద్ధలుగొట్టి చూడగా అప్పటికే అతను మృతిచెంది ఉన్నాడు. మృతుడి బావ చందు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పులపాలవ్వడంతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా