నిత్య పరీక్ష.. నేత్రాలకు రక్ష
అంధత్వ నివారణకు చేపట్టిన ‘కంటి వెలుగు’ జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతోంది. ఎక్కువ మంది నేత్ర సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది.
సంగాయిగూడ తండాలో కంటి పరీక్ష
న్యూస్టుడే-మెదక్, మెదక్ రూరల్: అంధత్వ నివారణకు చేపట్టిన ‘కంటి వెలుగు’ జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతోంది. ఎక్కువ మంది నేత్ర సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది. చాలా మందికి చూపు మందగించడం, శుక్లాల ఇబ్బందులు నిర్ధారణ అవుతున్నాయి. ఈ అంశంపై ‘న్యూస్టుడే’ కథనం.
జిల్లా వ్యాప్తంగా నేత్ర పరీక్షలు నిర్వహించేందుకు 40 బృందాలను ఏర్పాటు చేశారు. జనవరి 19న కార్యక్రమం ప్రారంభం కాగా, శని, ఆదివారాల్లో మినహాయించి మిగతా రోజుల్లో శిబిరాలు కొనసాగుతున్నాయి. కంటి జబ్బులతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందుల పంపిణీతో పాటు వైద్యసలహాలు అందిస్తున్నారు. పని ఒత్తిడి, ఉద్యోగ భారం, చరవాణి, కంపూటర్ల వినియోగం తదితర కారణాలే సమస్యలకు కారణమవుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్థులకు డయాబెటిక్ రెటినోపతి లక్షణాలను గుర్తించే యంత్రం లేకపోవడంతో చాలా మంది నిరాశగా వెనుదిరుగుతున్నారు.
రెండింటితో సతమతం
ఇప్పటివరకు నిర్వహించిన శిబిరాల్లో చాలా మంది దగ్గరి, దూరపు చూపుతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దగ్గరి చూపులో ఇబ్బంది ఉండేవారికి అద్దాలను అందజేశారు. దూరపు సమస్య ఉన్న వారికి తగిన అద్దాలు తెప్పించి, 15 రోజుల్లో అందజేస్తారు. శిబిరాల్లో వీరి పూర్తి వివరాలను నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా చుక్కల మందుతో పాటు విటమిన్ ఏ, డీ, బీకాంప్లెక్స్ మాత్రలను పంపిణీ చేస్తున్నారు.
సగటున 120 మందికి పరీక్షలు
పంచాయతీలు, పురపాలికల్లో షెడ్యూల్ ప్రకారం శిబిరాలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాలకు బృందాలు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిత్యం 137 మందికి పరీక్షలు నిర్వహించాలనేది లక్ష్యం కాగా, ప్రస్తుతం 120 మందికి పరీక్షిస్తున్నారు. గురువారం కలెక్టరేట్లో శిబిరం ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు కొనసాగనుంది. స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆశాకార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేస్తూ, శిబిరం ఏర్పాటు సమాచారాన్ని అందజేస్తున్నారు.
ప్రయాస తప్పింది
కంటి పరీక్షలకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. ఊర్లోనే చేయించడం వల్ల ప్రయాసతో పాటు డబ్బుల ఖర్చు తప్పింది. నేత్ర సమస్య ఉండటంతో ఇక్కడికి వచ్చా. అద్దాలు ఇచ్చారు. తండావాసులందరు సద్వినియోగం చేసుకుంటున్నారు.
కాట్రోజ్ కిషన్, సంగాయిగూడ తండా, మెదక్ మండలం
స్పందన లభిస్తోంది
ప్రతిరోజు ప్రజలనుంచి స్పందన లభిస్తోంది. అద్దాలు అవసరం ఉన్న వారికి వెంటనే ఇస్తున్నాం. ఇప్పటి వరకు వచ్చిన 32వేల అద్దాలలో ఏడువేలకు పైగా అందజేశాం. దూరదృష్టిలోపం ఉన్న వారి వివరాలను నమోదు చేసుకుని, వారికి 15 రోజుల తర్వాత కళ్లాద్దాలు అందజేయనున్నాం.
చందునాయక్, జిల్లా వైద్యాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తగతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
ద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?