ఇంటింటికీ వెళ్లి అవగాహన
ఓటరు జాబితా ప్రకారం ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని పాలనాధికారి రాజర్షిషా స్థానిక అధికారులను ఆదేశించారు.
శిబిరం వద్ద నమోదు వివరాలను తెలుసుకుంటున్న పాలనాధికారి రాజర్షిషా
కౌడిపల్లి, న్యూస్టుడే: ఓటరు జాబితా ప్రకారం ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని పాలనాధికారి రాజర్షిషా స్థానిక అధికారులను ఆదేశించారు. గురువారం కౌడిపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీల్లో వార్డుల వారీగా తిరుగుతూ శిబిరాలకు వచ్చేలా చూడాలన్నారు. ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శులు, వీవోఏలు, ఆశా కార్యకర్తలు అందరినీ కలిసి ఆహ్వానించాలని తెలిపారు. గ్రామస్థుల అవసరాల మేరకు ఉదయమే పరీక్షలను ప్రారంభించాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి శిబిరాలను విజయవంతం చేయాలని, నిర్లక్ష్యం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శిబిరంలో స్టాంపింగ్ లేకపోవడంతో స్థానిక వైద్యాధికారి శ్రీకాంత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం చేస్తావా ఇంటికి వెళతావా అని హెచ్చరిస్తూ తాఖీదు జారీ చేయాలని జిల్లా వైద్యాధికారి చందూనాయక్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఉప వైద్యాధికారిణి విజయనిర్మల, ఎంపీడీవో శ్రీనివాస్, ఉపతహసీల్దార్ తారాబాయి ఉన్నారు.
స్వీప్ నోడల్ అధికారికి అభినందనలు : మెదక్, న్యూస్టుడే: ఓటరు నమోదు, ఆధార్ అనుసంధానం, స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో విశేష కృషిచేసినందుకు రాష్ట్ర స్థాయి ప్రత్యేక కేటగిరీ అవార్డు అందుకున్న నోడల్ అధికారి రాజిరెడ్డిని పాలనాధికారి రాజర్షిషా అభినందించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అందజేసిన ప్రశంసాపత్రం, మెమెంటోను ఆయన పాలనాధికారికి చూపించారు. కార్యక్రమంలో అదనపు పాలనాధికారి రమేశ్ పాల్గొన్నారు. అంతకుముందు టీఎన్జీవోలు పాలనాధికారి రాజర్షిషాను కలిసి అభినందనలు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షులు నరేందర్, కార్యదర్శి రాజ్కుమార్, బాధ్యులు అనురాధ, ఇక్బాల్పాషా, ఫజలుద్దీన్, రఘునాథ్రావు, విక్రంరెడ్డి, రామాగౌడ్లు పాలనాధికారిని కలిసిన వారిలో ఉన్నారు.
ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి : కంటిచూపుతో బాధపడుతున్న వారికి కంటివెలుగు కార్యక్రమం వరమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆమె కలెక్టరేట్లో పాలనాధికారి రాజర్షిషాతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన వారు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ రోహిణిప్రియదర్శిని,అదనపు పాలనాధికారులు రమేశ్, ప్రతిమాసింగ్, డీఎంహెచ్వో చందునాయక్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ