‘ఉపాధి’కి కోత... సేంద్రియానికి ఊతం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆయా రంగాలపై ప్రతికూల, అనుకూల ప్రభావాలు చూపనున్నాయి.
న్యూస్టుడే, మెదక్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆయా రంగాలపై ప్రతికూల, అనుకూల ప్రభావాలు చూపనున్నాయి. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినప్పటికి... గ్యాస్ ధర విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిరుద్యోగ యువతకు ఎలాంటి వరాలు ప్రకటించలేదు. పనులు లేక సొంత ఊరిలో ఉపాధి పనులకు వెళ్లే కూలీలపై ప్రభావం పడనుంది. వలసలను నివారించేందుకు తీసుకవచ్చిన ఉపాధి పథకానికి కేంద్రం ఈ బడ్జెట్లో నిధులను తగ్గించింది. గతేడాది రూ.93 వేల కోట్లకు పైగా కేటాయించగా, ఈ దఫా రూ.20 వేల కోట్లు తగ్గిస్తూ, రూ.73 వేల కోట్లకు పరిమితం చేశారు. రాష్ట్ర స్థాయిలో మెతుకుసీమ ఉపాధి పనుల్లో టాప్ -5లో నిలుస్తోంది.
ఆన్లైన్లోకి సహకారం
చిన్న, సన్నకారు రైతుల సంక్షేమానికి సహకార వ్యవస్థ ఆధారిత ఆర్థిక నమూనాను అవలంభిస్తున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. దీని కోసం దేశ వ్యాప్తంగా ప్రాథమిక సహకార పరపతి సంఘా (పీఏసీఎస్-ప్యాక్స్)లను కంప్యూటీకరణ చేయాలని నిర్ణయించారు. దీనికి రూ.2,516 కోట్లు కేటాయించగా, జిల్లాలోని పలు ప్యాక్స్లకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు మార్కెటింగ్ను ప్రోత్సహించేందుకు నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సాగుకు అనుబంధంగా ఉన్న చేపలు, పశువులు, జీవాల పెంపకానికి సహకారం అందించేందుకు కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని వల్ల సంఘాల సభ్యులతో పాటు అన్నదాతలకు కొంత మేర ప్రయోజనం కలగనుంది. జిల్లాలో 37 సోసైటీలున్నాయి.
రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా..
పంటల సాగులో ఎరువుల వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో ఖర్చులు, కాలుష్యం పెరిగి, చీడపీడలు సోకుతున్నాయి. వాటి నివారణకు పురుగుమందులపై విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో సేంద్రియ సేద్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం కోటి మంది రైతులను ప్రోత్సహించనుంది. వీరికి సూక్ష్మ ఎరువులు, పురుగు మందులను సరఫరా చేయడానికి బయో ఇన్పుట్ రిసోర్సు సెంటర్లను ఏర్పాటు చేస్తారు. రసాయన ఎరువుల సమతుల వినియోగాన్ని పెంచేందుకు పీఎం ప్రణామ్ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. ఇప్పటికీ జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి క్లస్టర్లో 50 ఎకరాల్లో సాగు జరిగేలా దృష్టి సారించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!