చేపల వేటకు వెళ్లి.. మత్స్యకారుడి మృతి
చెరువులో చేపలు పట్టేందుకు విసిరిన వల కాళ్లకు చుట్టుకొని నీటితో మునిగి ఊపిరాడక ఓ మత్స్యకారుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారంలో చోటుచేసుకుంది.
మనోహరాబాద్, న్యూస్టుడే: చెరువులో చేపలు పట్టేందుకు విసిరిన వల కాళ్లకు చుట్టుకొని నీటితో మునిగి ఊపిరాడక ఓ మత్స్యకారుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సందీప్రెడ్డి తెలిపిన వివరాలు.. పోతారానికి చెందిన దుంపల యాదగిరి (50), నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఓ కూతురికి వివాహం కాగా, చిన్న కూతురు దివ్యాంగురాలు. యాదగిరి కూలీ పనులు చేయడంతో పాటు చెరువులో చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం సాయంత్రం యాదగిరి చేపలు పట్టేందుకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో నాగమణి.. తన మామ రాజయ్యకు విషయం చెప్పింది. గ్రామానికి చెందిన స్వామితో కలిసి వెతకగా వద్ద మృతుడి దుస్తులు కనిపించాయి. అప్పటికే చీకటి పడటంతో గురువారం అందులో వెతకగా మృతదేహం లభ్యమైంది. నాగమణి ఫిర్యాదుతో కేసు నమోదైనట్లు ఎస్ఐ చెప్పారు.
కారు ఢీకొని వృద్ధురాలి మృతి
కంది, న్యూస్టుడే: జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలిని కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన సంగారెడ్డి రూరల్ ఠాణా పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై ఖుర్షీద్ తెలిపిన వివరాలు.. కంది మండలం కవలంపేట్కు చెందిన ఎం.పెంటమ్మ(65) 65వ నంబరు జాతీయ రహదారిపై నడుచుకుంటూ మనవడిని పాఠశాలకు తీసుకెళుతోంది. సంగారెడ్డి నుంచి పటాన్చెరు వైపు వెళ్తున్న కారు ఆమెను బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కొడుకు నర్సింలు ఫిర్యాదు మేరకు కారు యజమాని శ్రీధర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
భార్య ప్రవర్తనకు విసిగిపోయి.. భర్త ఆత్మహత్య
దుబ్బాక, న్యూస్టుడే: భార్యకు వివాహేతర సంబంధం ఉందనే కారణంతో జీవితం మీద విరక్తి చెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దుబ్బాక మండలం శిలాజినగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మదిర గ్రామం టేకులతండాలో గురువారం చోటుచేసుకుంది. దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ వివరాలు తెలిపారు. టేకులతండాకు చెందిన వ్యక్తి (38)కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతను రెండేళ్ల క్రితం బతుకు దెరువుకు విదేశాలకు వెళ్లాడు. నెల క్రితం తిరిగి వచ్చాడు. ఇదే గ్రామానికి చెందిన దేవేందర్తో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్నాడు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆమె బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. గురువారం గ్రామంలోని బంధువుల వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు చీరతో భర్త ఉరి వేసుకున్నాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, పంచనామా నిర్వహించారు. తమ బావ మృతికి చెల్లి, ఆమె ప్రియుడే కారణమని మృతుని బావమరిది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బావ ప్రేమించి.. పెళ్లికి నిరాకరించాడని..
కొండాపూర్, కొడంగల్: మేనబావ, యువతి ప్రేమించుకున్నారు. బావ పెళ్లికి నిరాకరించడంతో యువతి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాలు.. కొడంగల్లోని ఓ గ్రామానికి చెందిన యువతి(19) నర్సింగ్ చదువుతోంది. బావను ప్రేమించిన యువతి.. గత 22న హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్ వద్ద పెళ్లి విషయమై అతడితో గొడవపడింది. బావ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కొండాపూర్ మండలంలోని ఓ ఫాంహౌజ్లో పనిచేస్తున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. గత నెల 31న అక్కడే పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు గమనించి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు