‘కాళేశ్వరం’తో సస్యశామలం: ఎంపీ
సాగునీటికి తండ్లాడిన తెలంగాణను కాళేశ్వరంతో సస్యశామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
కూడవెల్లి, హల్దీ వాగుల్లోకి గోదావరి నీటిని విడుదల చేసిన నాయకులు
కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేస్తున్న ఎంపీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి,
ఎఫ్డీసీ ఛైర్మన్ ప్రతాప్రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు, నాయకులు
గజ్వేల్, వర్గల్, న్యూస్టుడే: సాగునీటికి తండ్లాడిన తెలంగాణను కాళేశ్వరంతో సస్యశామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోకి, వర్గల్ మండలం అవుసులోనిపల్లి వద్ద హల్దీ వాగులోకి ఆయన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అనతికాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి జలాలను బీడు పొలాల ధరి చేర్చారన్నారు. ఒకప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడి, కేసులు వేసిన వారే ఇప్పుడు సాగునీరు విడుదల చేయాలని కోరటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలతో దేశం అధోగతి పాలవుతుందన్నారు. అసమానతలను నిలువరించే శక్తి కేసీఆర్కు మాత్రమే ఉందన్నారు. అంతకుముందు గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ రోజాశర్మ, నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరాం, ఎస్ఈ వేణు, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియా ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, ప్యాక్స్ ఛైర్మన్ వెంకటేశంగౌడ్, బల్దియా ఉపాధ్యక్షుడు జకీ, జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం, ఆత్మకమిటీ ఛైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.
వడివడిగా తరలుతున్న నీరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)