‘జాతరలో భక్తులకు అసౌకర్యం కలిగించొద్దు’
ఏడుపాయల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పాలనాధికారి రాజర్షిషా సూచించారు.
ఏర్పాట్లపై ఆరా తీస్తున్న పాలనాధికారి రాజర్షిషా, అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్, రమేశ్, ఎస్పీ రోహిణిప్రియదర్శిని
పాపన్నపేట, న్యూస్టుడే: ఏడుపాయల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పాలనాధికారి రాజర్షిషా సూచించారు. ఈ నెల 18 నుంచి 20 వరకు జరిగే జాతరను పురస్కరించుకుని శుక్రవారం అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్, రమేశ్, ఎస్పీ రోహిణిప్రియదర్శినితో కలిసి ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలు, పార్కింగ్ స్థలాలు, ప్రయాణప్రాంగణాలు, వనదుర్గా ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద ట్రాఫిక్ను నియత్రించాలన్నారు. చౌరస్తా వద్ద శాశ్వత ప్రాతిపదికన బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పార్కింగ్ స్థలాలతో పాటు వనదుర్గా ప్రాజెక్టు, వంతెనలు, నదీపాయల ప్రమాద స్థలాల వద్ద బారికేడ్లు, సూచికలు ఏర్పాటు చేసి భక్తులను అటువైపు వెళ్లకుండా పోలీసులతో గస్తీ చేపట్టాలని చెప్పారు. గజ ఈతగాళ్లు, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ దీపాలు బిగించాలని, విద్యుత్తు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతంలో వ్యర్థాలు పడేయకుండా పర్యవేక్షించాలని చెప్పారు. వనదుర్గా ప్రాజెక్టుకు ఈ నెల 10న ట్రయల్గా నీటిని వదిలి, 15న 0.450 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నీటిపారుదల అధికారులకు సూచించారు. అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ మర్యాదల ప్రకారం సత్కరించారు. నీటిపారుదల ఈఈ శ్రీనివాసరావు, డీపీవో సాయిబాబా, మత్స్యశాఖ ఏడీ రజనీ, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, పాలకమండలి ఛైర్మన్ బాలాగౌడ్, ఈవో శ్రీనివాస్, అధికారులు, తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు