ప్రగతి బాట.. సంక్షేమకాంక్ష!
జిల్లాలో నీటిపారుదల, విద్య, వైద్యం, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీతో పాటు పలు శాఖల్లో నిధులు లేక చాలా చోట్ల పనులు మధ్యలో నిలిచాయి.
రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుపై జిల్లా వాసుల ఆశ
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలో నీటిపారుదల, విద్య, వైద్యం, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీతో పాటు పలు శాఖల్లో నిధులు లేక చాలా చోట్ల పనులు మధ్యలో నిలిచాయి. కొన్ని చోట్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు పనులపై ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. శుక్రవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు నిధుల కేటాయింపుపై ప్రజలు ఆశ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కథనం.
పూర్తికాని వైద్య కళాశాల భవనాలు
సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. నిధులు పూర్తిస్థాయిలో కేటాయిస్తే వేగవంతం కానున్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్సీలు, ఆరోగ్య ఉప కేంద్రాల భవనాల నిర్మాణాలు, వైద్య పరికరాలకు నిధులు రావాల్సి ఉంది. కొన్ని చోట్ల నిధుల కొరత వల్ల గుత్తేదార్లు పనులు మధ్యలోనే నిలిపివేశారు. కేసీఆర్ కిట్టు పథకంలో లబ్ధిదారులకు ప్రోత్సాహక మొత్తం సకాలంలో అందడం లేదు.
రవాణా సాఫీగా సాగాలంటే..
జిల్లాలో గతేడాది కురిసిన వర్షాలకు ఆర్అండ్బీ, పీఆర్ శాఖల పరిధిలోని పల్లె, పట్టణదారులు చాటాచోట్ల దెబ్బతిన్నాయి. వంతెనలు శిథిలావస్థకు చేరాయి. వాటి మరమ్మతులకు మూడేళ్ల నుంచి నిధులు కేటాయించలేదు. ఈసారైనా నిధులు కేటాయిస్తేనే ప్రజా రవాణా సాఫీగా సాగనుంది.
ఎత్తిపోతలు, కొత్త చెరువులకు..
ఎత్తిపోతల పనులకు భూమి పూజ చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు (పాతచిత్రం)
బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలతో జిల్లాను సస్యశ్యామలం చేయాలని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే ఆయా పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. డీపీఆర్(డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) పూర్తయింది. భూసేకరణ కొనసాగుతోంది. ఆయా పనులకు టెండర్లు, ఒప్పందం పూర్తయింది. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే పనులకు మార్గం సుగమం అవుతుంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎనిమిది కొత్త చెరువులు తవ్వేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఒక్కపైసా కేటాయించలేదు. వాటిపైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. రెండేళ్లుగా వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపడితేనే అన్నదాతలకు ప్రయోజనం దక్కనుంది.
కీలకమైనవి మరికొన్ని..
* మహిళా పొదుపు సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలతో ఆర్థిక అభ్యున్నతికి బాటలు వేసుకుంటున్నారు. వీరిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు పథ]కాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద రావాల్సిన నిధులు 2019-20 నుంచి నిలిచిపోయాయి.
* బీసీ యువతకు స్వయం ఉపాధి కోసం 2017-18లో దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటివరకు 760 మందికి రూ.50వేల చొప్పున శతశాతం రాయితీపై అందజేశారు. మిగిలిన నిరుద్యోగ యువతకు రాయితీ కోసం రూ.కోట్లు అవసరం.
* పట్టణ ప్రగతి పేరుతో ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. పూర్తి స్థాయిలో మంజూరు కావడం లేదు. జిల్లాలోని అన్ని పురపాలిలకు నెలకు రూ.5.50 కోట్ల రావాల్సి ఉండగా రూ.3 కోట్లు మాత్రమే విడుదల చేస్తోంది. దీంతో చాలా వరకు పట్టణ ప్రగతి కింద చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలాయి.
* జిల్లాలో 8 బీసీ, 11 మైనార్టీ గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. బీసీ గురుకులాలకు కేటాయించిన మండలాల్లో భవనాలు లేకపోవడంతో సంగారెడ్డిలోనే అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM