పురపాలికల్లో పన్నుల మోత!
జిల్లాలోని పురపాలికల్లోని నివాసాల నుంచి వసూలు చేసే పన్ను పెంచడంతో పట్టణవాసులపై ఆర్థిక భారం తప్పడం లేదు.
జిల్లా కేంద్రంలోని ఓ భవనానికి కొలతలు వేస్తున్న అధికారులు
న్యూస్టుడే, మెదక్ టౌన్: జిల్లాలోని పురపాలికల్లోని నివాసాల నుంచి వసూలు చేసే పన్ను పెంచడంతో పట్టణవాసులపై ఆర్థిక భారం తప్పడం లేదు. పురపాలికలకు మాత్రం ఆదాయం పెరిగింది. జిల్లాలో మెదక్ పురపాలికలో ఔరంగాబాద్, అవుసులపల్లి, పిల్లికొట్టాల గ్రామాలు 2018లో విలీనం కాగా, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్లు కొత్తగా పురపాలికలుగా అవతరించాయి. ఈ సమయంలో మూడేళ్ల వరకు పన్నులు పెంచమని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆ గడువు కాస్త ముగియడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన మేర పన్నులను వసూలు చేయనున్నారు.
పూర్తయిన సమగ్ర సర్వే
ఇళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు అంతర్జాలంలో నిక్షిప్తం చేసేందుకు ప్రభుత్వం భువన్ యాప్ను రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని పురపాలికల్లో అధికారులు ఇంటింటికీ వెళ్లి సమగ్ర వివరాలు సేకరించి యాప్లో నమోదు చేశారు. ఇళ్లు ఎంత విస్తీర్ణం, ఎన్ని అంతస్తులు, ఖాళీ స్థలం ఎంత ఉందనే వివరాలు సేకరించి సీడీఎంఏ కార్యాలయానికి అనుసంధానం చేశారు. ప్రస్తుతం వివరాల ఆధారంగానే ఆస్తి పన్నుల్లో 0.25 శాతం వ్యత్యాసం ఉంటుంది.
* మెదక్ పురపాలికలో గతంలో ఆస్తి పన్ను లక్ష్యం రూ.4 కోట్లు ఉండగా.. ఈసారి రూ. 5.17 కోట్లకు పెరిగింది. నర్సాపూర్లో రూ.3 కోట్లకు రూ.50 లక్షలు పెరిగింది. రామాయంపేటలో గతంలో రూ.42.91 లక్షలు ఉండగా ఈ సారి రూ. 1.09 కోట్లుగా నిర్దేశించారు. తూప్రాన్లో రూ.1.19 కోట్ల నుంచి రూ.1.76 కోట్లకు పెరిగింది.
పెరిగిన ఆదాయం
జిల్లాలో నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట పురపాలికలు కొత్తగా ఏర్పడాయి. మూడేళ్ల వరకు ఇచ్చిన వెసులుబాటు ప్రకారం విలీనమైన గ్రామాల్లో, కొత్త వాటిల్లో మ్యానువల్ పద్ధతిలోనే పన్నులు వసూలు చేసేవారు. ప్రస్తుతం సీడీఎంఏకు అనుసంధానం చేయడంతో కొత్త విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల లక్ష్యం రూ.8.61 కోట్లు ఉండగా ఈ సారి రూ.11.52 కోట్లకు పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?