రోడ్డు విస్తరణ ప్రారంభమెప్పుడో..?
తూప్రాన్ పురపాలిక కేంద్రంలో కాలనీలను సైతం విస్తరించి ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
వినాయకనగర్లో పనులు
న్యూస్టుడే, తూప్రాన్: తూప్రాన్ పురపాలిక కేంద్రంలో కాలనీలను సైతం విస్తరించి ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలో ప్రధాన కాలనీ అయిన వినాయకనగర్ను ముందుగా విస్తరించాలని పాలకవర్గ సభ్యులు భావించారు. మూడు నెలల క్రితం ప్రధాన రహదారి నుంచి గాంధీనగర్ వరకు ఇరు వైపులా ఇళ్లను కూల్చివేశారు. పనులు మొదలుపెట్టి మూడు నెలలు గడిచినా విస్తరణ పనులు ప్రారంభం కాకపోవడంతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. కూల్చివేసిన భవనాలు మట్టి కుప్పలతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇళ్లను కూల్చివేయడంతో పలు చోట్ల స్తంభాలు రోడ్డు మధ్యలో ఉండిపోయాయి.
నిధులు సిద్ధం : తూప్రాన్లో అభివృద్ధి పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. వీటి నుంచే వినాయకనగర్లో విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కాలనీలో సుమారు 60 ఇళ్లను పాక్షికంగా కూల్చివేశారు. కొందరు ఇప్పటికే వెనుకకు జరిగి నిర్మాణాలు సైతం పూర్తిచేసుకున్నారు. నిధులు ఉన్నప్పటికీ పనుల్లో జాప్యం కావడంపై కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విస్తరణ పనులు పూర్తయ్యాక భగత్నగర్కాలనీతో పాటు మిగతా చోట్ల పనులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇకనైనా పనులను వేగంగా పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు విన్నవిస్తున్నారు.
వారం రోజుల్లో పనులు షురూ
ముందుగా వినాయకనగర్లో విస్తరణ పనులను వారం రోజుల్లో ప్రారంభిస్తాం. పనులకు సంబంధించి టెండరు సైతం పూర్తయింది. నిధులు సిద్ధంగా ఉన్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తీరుస్తాం.
మోహన్, పురపాలిక కమిషనర్ తూప్రాన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
పార్టీ శ్రేణులతో అభ్యర్థుల అంతర్గత సమావేశాలు -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!