యువత చేతిలోనే దేశ భవిత
యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరూ చదువుకుని దేశానికి సేవలు అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని అన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని
బార్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని, తదితరులు
న్యూస్టుడే, పరిగి, ధారూర్, బషీరాబాద్, వికారాబాద్ గ్రామీణం: యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరూ చదువుకుని దేశానికి సేవలు అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా, పరిగి పట్టణంలోని కోర్టు ఆవరణలో నిర్మించిన బార్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి యువత సేవలు ఎంతో అవసరమని, కానీ ఎక్కువగా సెల్ఫోన్ల వినియోగంతో పక్కదాని పడుతున్నారని, వాటిని పక్కకు పెట్టి చదువుకోవాలని సూచించారు. సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని అన్నింటా సమానంగా దూసుకెళ్లాలని తెలిపారు. పరిగిలో బార్ అసోసియేషన్ కోరిక మేరకు అదనపు కోర్టుతో పాటు కొత్త భవనం ప్రారంభానికి కృషి చేస్తామన్నారు. జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి కె.సుదర్శన్ మాట్లాడుతూ పని ప్రదేశంలో వసతులు ఉంటే మరింత ఉల్లాసంగా పనిచేసేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి డీబీ శీతల్, పరిగి, వికారాబాద్ న్యాయమూర్తులు వి.హరికుమార్, కె.శ్రీకాంత్, పరిగి, వికారాబాద్ బార్ అసోయేషన్ అధ్యక్షులు కె.నరేంద్రయాదవ్, మాధవరెడ్డి, ఏఎస్పీ మురళీధర్రావు, డీఆర్వో అశోక్కుమార్, ఆర్డీఓ విజయకుమారి, బార్ అసోయేషన్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
పద్మనాభుని ఆలయ సందర్శన..
వికారాబాద్లో ఆహ్లాదకర వాతావరణంలో వెలసిన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని అన్నారు. ఆలయ సందర్శనకు వచ్చిన ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత తెలియజేసిన అనంతరం స్వామివారి చిత్రపటం అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె 14 కి.మీ దూరంలోని కోట్పల్లి ప్రాజెక్టును సందర్శించారు. రక్షణ కోట్ ధరించి పడవలో ప్రయాణం చేశారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!