తరుగు బాధలు ఉండవిక!
రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సరఫరా చేస్తున్న బియ్యం తూకం పక్కాగా ఉండేలా ఈ పోస్ విధానం అమలు చేస్తున్నారు.
ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఈ-పోస్ యంత్రాలు
సంగారెడ్డి ఎంఎల్ఎస్ పాయింట్ గోదాములో నిల్వలను పరిశీలిస్తున్న అధికారులు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సరఫరా చేస్తున్న బియ్యం తూకం పక్కాగా ఉండేలా ఈ పోస్ విధానం అమలు చేస్తున్నారు. దీనివల్ల లబ్ధిదారులకు తరుగు లేకుండా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు చేరుతున్న బియ్యం బస్తాలో తరుగుపై రేషన్ డీలర్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బస్తాలోనూ తరుగు ఉంటుండటమే దీనికి కారణం. ఇక మీదట ఆ ఇబ్బందులు దూరం కానున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ గోదాముల్లోనూ ఈ-పాస్ యంత్రాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కథనం.
ఎట్టకేలకు కదలిక
బయోమెట్రిక్ విధానం అమలులో ఉండటంతో కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యం ఎలక్ట్రానిక్ తూకపు యంత్రంపై పెట్టి సరితూగినప్పుడే రసీదు ప్రింట్ రూపంలో వస్తుంది. బియ్యం తక్కువగా ఉంటే రసీదు వచ్చే అవకాశం ఉండదు. దీంతో లబ్ధిదారులకు ఒక్క గ్రాము బియ్యమైనా తగ్గకుండా ఇవ్వాల్సిందే. దీనివల్ల కార్డుదారులకు సక్రమంగా సరఫరా అవుతోంది. డీలర్లకు పంపిణీ చేసే బియ్యంలో తరుగు ఉండటంతో వారు నష్ట పోవాల్సి వస్తోంది. తరుగుకు సరిపడా బియ్యం కేటాయించాల్సి ఉన్నా అదీ.. జరగడం లేదు. దీనిపై నిలదీస్తే ఎక్కడ డీలర్ పదవికి ఎసరు పెడతారోనని భయంతో ఏమీ చేయలేకపోతున్నామని పలువురు డీలర్లు వాపోయారు. తరగు విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో విజ్ఞప్తులు చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించంతో పాటు ఎంఎల్ఎస్ పాయింట్లలో ఈ-పాస్ విధానాన్ని అమలులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒకేసారి 50 క్వింటాళ్ల బియ్యం తూకం
ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు పెద్ద పీట వేసేలా సప్లయ్ చైన్ మేనేజ్మెంట్ విధానంలో భాగంగా గోదాముల్లో ఒకే సారి 50క్వింటాళ్ల బియ్యం తూకం వేసేలా ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేశారు. రేషన్ డీలర్తోపాటు వారి కుటుంబంలోని ముగ్గురికి సంబంధించిన వివరాలను యంత్రంలో నమోదు చేశారు. ఏ ఒక్కరు ఎంఎల్ఎస్ పాయింట్ గోదాముకు వచ్చినా సరిపోతుంది. తమకు కేటాయించిన బియ్యం కోటాకు అనుగుణంగా తూకం వేయించుకుని ఈ-పోస్ యంత్రంపై వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
* జిల్లాలో సివిల్ సప్లయ్ గోదాములు: 6
* రేషన్ దుకాణాలు: 845
* ఆహార భద్రత కార్డులు: 3.78లక్షలు
* బియ్యం కోటా: 5,500 మెట్రిక్ టన్నులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.