చిరుధాన్యాలు.. ఆరోగ్య సిరులు
చిరుధాన్యాలు.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుత ఆధునిక జీవనంలో ఆరోగ్య రక్షణకు వీటిని తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.
న్యూస్టుడే, జహీరాబాద్ అర్బన్, జహీరాబాద్
వంటకాల గురించి వివరిస్తున్న మహిళలు
చిరుధాన్యాలు.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుత ఆధునిక జీవనంలో ఆరోగ్య రక్షణకు వీటిని తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు నిరుపేదల ఆకలి తీర్చిన చిరుధాన్యాలకు మళ్లీ మహర్దశ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్న చిరుధాన్యాల వంటకాలు, పోషక విలువలు, పాత పంటల సాగుపై జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ- కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తాధ్వర్యంలో జాతర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా వాటితో తయారుచేసే వంటకాల తీరుపై అవగాహన కల్పిస్తుండటం విశేషం.
తొలిసారి..
ఐక్యరాజ్య సమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. దీని వెనుక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన డీడీఎస్, మిల్లెట్స్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా కృషి ఉంది. డీడీఎస్ రెండు దశాబ్దాలుగా పాత పంటల రుచులను కెఫే గ్రీన్ ఎథ్నిక్ పేరుతో దేశంలోనే తొలి చిరుధాన్యాల హోటల్ నడుపుతోంది. దీనికితోగా ఐదేళ్ల నుంచి సముదాయ ఉత్పత్తి కేంద్రం నిర్వహిస్తూ ఇన్స్టంట్ మిక్స్లు, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తోంది.
వంటలు, పోషక విలువలపై..
తృణ ధాన్యాలు కాదు ఆరోగ్యపు సిరిధాన్యాలుగా ప్రాచుర్యం పొందుతున్న పాత పంటలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు డీడీఎస్, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా జహీరాబాద్ డివిజన్లోని ఆరు గ్రామాల్లో వంటకాలు, పోషకాలపై గ్రామీణ మహిళా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ పొలాల్లో మిశ్రమ విధానంలో పండించే చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలతో వివిధ రకాల పాత వంటలు మహిళలు వండుకొని తీసుకొస్తున్నారు.
సలహాలు, సూచనలు
చిరుధాన్యం వంటకాలు, పోషక విలువలు, ఆరోగ్య పరిరక్షణకు అందించే తోడ్పాటుపై కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త హేమలత మహిళా రైతులు, గృహిణులకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళలకు ముందస్తు సమాచారం ఇచ్చి ఇళ్లలో అందుబాటులో ఉన్న చిరుధాన్యాలతో వంటలు తయారు చేసి తీసుకొచ్చేలా సూచనలు చేస్తున్నారు. వాటిని ప్రదర్శిస్తూ పాత పంటల ప్రాముఖ్యత, వంటలతో ఉపయోగాలపై మహిళలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. వృద్ధ మహిళలు తమ అనుభవాలను మూడు తరాల కొత్త కోడళ్లకు వివరిస్తున్నారు.
50 రకాల ప్రదర్శన
పౌష్టికాహార అవగాహన సదస్సుల్లో మహిళలు 50 రకాలకు పైగా ఆహార పదార్థాలను తయారు చేసి తీసుకొస్తున్నారు. తైద, పజ్జోన్న, సాయిజొన్న, బెరికే రొట్టెలు, కొర్ర బువ్వ, సామ బువ్వ, యవ్వ పాయసం, జొన్న అంబలి, నువ్వుల పోలెలు, సజ్జ మలిద, బెబ్బరి గుడాలు వంటి వంటలతో పాటు దొగ్గలి కూర, ఓమా కూర, పుంటి కూర వంటి సహజ ఆకుకూరలు కలిపి మొత్తంగా 50కి పైగా వంటలు, కూరలు తయారు చేసి ప్రదర్శన చేపడుతున్నారు. పరస్పరం బదిలీ చేసుకొని కలిసి భోజనం చేస్తున్నారు.
ఆరోగ్యానికి భరోసా..
హేమలత, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త, కేవీకే జహీరాబాద్
ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్న చిరుధాన్యాల వంటకాలు, పోషక విలువలు, పాత పంటల సాగుపై పోషకాహార వారోత్సవాల్లో అవగాహన కల్పిస్తున్నాం. మహిళా రైతులు పాత పంటల సాగును కొనసాగించేలా కృషి చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.