logo

నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే

దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు.

Published : 06 Feb 2023 01:45 IST

అక్బర్‌పేట కూడలిలో ఆకాశ (హైమాస్ట్‌) దీపాలను ప్రారంభిస్తున్న రఘునందన్‌రావు

న్యూస్‌టుడే - మిరుదొడ్డి, దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఆదివారం అక్బర్‌పేట కూడలిలో, దుబ్బాక మండలంలోని పద్మశాలి గడ్డలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆకాశ దీపాలను (హైమాస్ట్‌) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తున్నానన్నారు. 317 జీవోతో రాష్ట్రంలోని 13 జిల్లాల ఉద్యోగులకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తన ఉనికిని కాపాడకోవడానికి తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పద్మశాలిగడ్డలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. బల్వంతాపూర్‌ గ్రామంలో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ పండగ సందర్భంగా ఆలయాన్ని సందర్శించారు. సర్పంచి పారుపల్లి సంధ్య, మిరుదొడ్డి మండలాధ్యక్షుడు దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని