పంచాయతీలకు నిధులు.. కొనసాగుతున్న పనులు
గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, మురుగు కాలువలు మెరుగుపడనున్నాయి. ఉపాధిహామీ పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.60 కోట్లు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు ఇటీవల జారీ చేసింది.
రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి రూ.60 కోట్లు
న్యూస్టుడే, గజ్వేల్గ్రామీణ
అక్కారంలో వేస్తున్న రహదారి
గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, మురుగు కాలువలు మెరుగుపడనున్నాయి. ఉపాధిహామీ పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.60 కోట్లు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు ఇటీవల జారీ చేసింది. పల్లె ప్రగతి, 15వ ఆర్థిక సంఘం నిధులు సరిపోక ఇబ్బందుల్లో ఉన్న పాలకవర్గాలకు తాజాగా మంజూరు కావడం కొంత ఊరటనిచ్చింది. గతేడాది ఇదే పథకం కింద రూ.62 కోట్లతో చేయగా బిల్లుల చెల్లింపు ఆలస్యమైంది. మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాలో 499 పంచాయతీలకు ఉపాధి పథకంలో మురుగు కాల్వలు సీసీ రోడ్ల నిమిత్తం ఏటా నిధులను విడుదల చేస్తున్నారు. కూలీల చెల్లింపులకు 40 శాతం, నిర్మాణ సామగ్రికి 60 శాతం నిధులు కేటాయిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సూచనతో కలెక్టర్ ఛైర్మన్గా ఉన్న కమిటీ ప్రతిపాదనలు పంపించడంతో మంజూరు చేశారు. రహదారుల నిర్మాణంలో ఎంపీడీవో, పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారు. గతంలో హడావిడిగా చేయడంతో కొన్నిచోట్ల నాణ్యత లోపించింది. ఆర్థిక సంవత్సరం లోపు చేయకపోతే నిధులు వెనక్కి వెళతాయి. రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి రూ.60 కోట్లు మంజూరయ్యాయని సిద్దిపేట పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్రావు చెప్పారు.
తాత్కాలికం వద్దు.. శాశ్వతం ముద్దు
న్యూస్టుడే, దుబ్బాక: దుబ్బాక పట్టణం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్అండ్బీ తారు రహదారులు అక్కడక్కడా గుంతలు, కంకర తేలాయి. వాహనదారులు తిప్పలు పడుతున్నారు. పట్టణం నుంచి చేర్వాపూర్ మీదుగా హబ్షీపూర్కు వెళ్లే దారిపై రామసముద్రం చెరువు కట్ట వద్ద గుంతలు ఏర్పడ్డాయి. రెణ్నెల్ల క్రితం మంత్రుల పర్యటన సందర్భంగా తాత్కాలిక మరమ్మతులు చేశారు. ప్రస్తుతం మళ్లీ అదే దశకు రోడ్లు చేరాయి. దుబ్బాక నుంచి లచ్చపేటకు వెళ్లే మార్గంల పెద్దమ్మ గుడి ముందుతారు రోడ్డుపై కంకర తేలింది. ఇటీవల దుబ్బాక ముదిరాజ్ సంఘం ప్రతినిధులు రెండు సార్లు గుంతల్లో మట్టి పోసి, పూడ్చారు. పెద్ద చెరువు అడుగు నుంచి నీరు లీకేజీ అవుతుండటంతో రోడ్డు బురదగా మారుతోంది. దుబ్బాక నుంచి దుంపలపల్లి దారి అస్తవ్యస్తంగా తయారైంది. దుబ్బాక-ముస్తాబాద్ రెండు వరుసల రహదారి నిర్మాణానికి అతి త్వరలోనే రూ.13 కోట్లతో పనులు ప్రారంభించనున్న ఆర్అండ్బీ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని పట్టణవాసులు కోరుతున్నారు.
పిట్ట గోడ లేని కల్వర్టు
మిరుదొడ్డి పట్టణంలో ప్రధాన రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులతో చేపట్టింది. రహదారి పూర్తయి సంవత్సరం గడుస్తున్నా పెద్ద చెరువు కట్టు కాలువపై కల్వర్టుకు పిట్ట గోడను నిర్మించలేదు. దీనివల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
న్యూస్టుడే, మిరుదొడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్