ప్రగతి రథం.. ప్రమాద రహితం
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఎనిమిది డిపోలు ఉండగా 238 అద్దె బస్సులు నడుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో మూడు డిపోల పరిధిలో 147 అద్దె సర్వీసులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి.
ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, మెదక్ అర్బన్, వికారాబాద్ టౌన్
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఎనిమిది డిపోలు ఉండగా 238 అద్దె బస్సులు నడుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో మూడు డిపోల పరిధిలో 147 అద్దె సర్వీసులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. నాలుగు జిల్లాల పరిధిలో 623 ప్రైవేటు డ్రైవర్లు పని చేస్తున్నారు. వీరందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే డిపోల వారీగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పనితీరు మెరుగుపై సలహాలు, సూచనలతో రోజంతా తర్ఫీదు ఇస్తూ వారిలో మార్పునకు ప్రయత్నిస్తున్నారు.
మర్యాద, సురక్షితం
ప్రధాన రెండు అంశాల ప్రాతిపదికన శిక్షణ ఇస్తున్నారు. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించడం ప్రధానం. చోదకు విషయాన్ని విస్మరిస్తే ప్రయాణికులకు అసౌకర్యానికి గురికావడమే కాకుండా మరోసారి బస్సు ప్రయాణం అంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రయాణికులకు ఆకట్టుకుంటేనే సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. సురక్షిత డ్రైవింగ్ విషయంలోనూ నిర్లక్ష్యం వద్దని, ఒత్తిడిని అధిగమించే మార్గాలపై అవగాహన కల్పిస్తున్నారు.
మెదక్లో అవగాహన కల్పిస్తున్న అధికారి
ప్రజలకు ఆర్టీసీపై నమ్మకం ఎక్కువ. సొంత వాహనాలున్నా అత్యధికులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు మొగ్గుచూపుతుంటారు. మరోవైపు అక్కడక్కడ ప్రమాదాలు చోటుచేసుకోవడం సంస్థకు మచ్చ తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయం పెంపుతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యంగా యాజమాన్యం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇస్తుండటం గమనార్హం.
ఏం నేర్పిస్తారంటే..
* ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితిని వివరించడంతో పాటు జీతభత్యాలు, ఆదాయం, ఖర్చులపై అవగాహన.
* సంస్థ నష్టాల నుంచి ముందడుగు వేసేందుకు ప్రతి ఉద్యోగి నిర్వహించాల్సిన పాత్రపై చర్చ.
* ప్రస్తుత పోటీ వాతావరణానికి అనుగుణంగా ఏ సంస్థలోనైనా మార్పు అవసరం. లేదంటే మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఉదాహరణలతో వివరిస్తూ పోటీ వాతావరణంలో నిలదొక్కుకునేలా కార్యోన్ముఖులను చేయడం.
* ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం.
* విధుల్లో ఉన్న సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. అనవసర విషయాలపై దృష్టిసారిస్తే ఏకాగ్రత కోల్పోతారని తెలియజేయడం.
* సానుకూలంగా ఆలోచించే వారు శ్రద్ధ, ఆత్మవిశ్వాసం, ఓపిక, విజయం కలిగి ఉంటారని, ఉద్యోగులు విధి నిర్వహణ సమయంలో సానుకూల ఆలోచనతో ఉంటే సంస్థకు ఆదాయం తద్వారా ఉద్యోగులకు ఉండే ప్రయోజనాలు వివరించడం.
* ప్రయాణికులతో మాట్లాడే విధానం మార్చుకోవడంతో పాటు సమయపాలన పాటించడం ముఖ్యమని శిక్షణలో భాగంగా సూచిస్తారు.
మార్పు వస్తోంది..
సుదర్శన్, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్
ఉద్యోగుల్లో మార్పుతో సంస్థ పురోగతి సాధ్యమన్న ఉద్దేశంతో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తర్ఫీదు పూర్తయిన వారిలో మార్పు గమనిస్తున్నాం. ప్రయాణికులతో సిబ్బంది గౌరవంగా ఉంటున్నారు. దీనివల్ల అత్యధికులు బస్సులో ప్రయాణించేందుకు వీలుంటుంది.
ఒత్తిడిని అధిగమించేలా..
మధు, మెదక్
బస్సు నడుపుతున్నప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండాలని శిక్షణలో భాగంగా అవగాహన కల్పించారు. రహదారి భద్రత నియమాలు వివరించారు. ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. కేఎంపీఎల్ పెంచి ఆదాయం రాబట్టేందుకు పలు సూచనలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
దివ్యమైన ఓటుకు సాక్ష్యం
[ 20-04-2024]
సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు. -
కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!