లంచం ఇస్తావా.. స్థలం రాసిస్తావా?: రైతును డిమాండ్ చేసిన ఆర్ఐ
రైతు భూమిని పట్టాదారు పాసు పుస్తకంలోకి ఎక్కించేందుకు లంచం డిమాండ్ చేసిన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల గిర్దావర్(రెవెన్యూ ఇన్స్పెక్టర్) అనిశా వలలో చిక్కుకున్నారు.
అనిశా వలలో చిన్నశంకరంపేట గిర్దావర్
చిన్నశంకరంపేట, న్యూస్టుడే: రైతు భూమిని పట్టాదారు పాసు పుస్తకంలోకి ఎక్కించేందుకు లంచం డిమాండ్ చేసిన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల గిర్దావర్(రెవెన్యూ ఇన్స్పెక్టర్) అనిశా వలలో చిక్కుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా అనిశా డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సంగాయపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుటుంబానికి సర్వే నం.1313లో 22 గుంటల సాగు భూమి ఉంది. పాత పట్టాదారు పాసు పుస్తకంలో ఆ వివరాలు ఉన్నప్పటికీ, కొత్త పుస్తకంలో నమోదు కాలేదు. విషయాన్ని ఆర్ఐ శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, రూ.2 లక్షలు ఇస్తే పనిచేసి పెడతానని తెలిపారు. అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో, ‘నీ పొలం పక్కనే నాకు ఓ ప్లాటు ఉందని, అందులో కలుపుకొనే విధంగా 18 గజాల స్థలం ఇచ్చి, ఆ మేరకు రూ.2 లక్షల్లో మినహాయించుకోమని తెలిపారు.
చివరకు రూ.లక్షకు ఒప్పందం చేసుకొని, పొలాన్ని పట్టాదారు పాసు పుస్తకంలో పొందుపరిచారు. చందంపేట గ్రామ వీఆర్ఏ సురేష్బాబును మధ్యవర్తిగా ఉంచి, లంచం డబ్బు కోసం శ్రీనివాస్పై ఒత్తిడి పెంచారు. జనవరి 5న ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్.. శ్రీనివాస్ను కలిసి విషయం వివరించారు. ముందస్తు వ్యూహంలో భాగంగా, సోమవారం అదే మండలంలోని రుద్రారం గ్రామ శివారులో ఆర్ఐ శ్రీహరి, వీఆర్ఏ సురేష్బాబులకు డబ్బు అందజేశాడు. అనిశా అధికారులను గమనించిన ఇద్దరూ ద్విచక్రవాహనంపై పారిపోతుండగా వెంబడించి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరినీ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సీఐలు వెంట్రాజ్గౌడ్, రమేష్లు డీఎస్పీ వెంట ఉన్నారు.
స్వాధీనం చేసుకున్న నగదు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా