వినతుల సమర్పణ.. పరిష్కారానికి కార్యాచరణ
సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ గ్రామాల నుంచి అర్జీదారులు సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అధికారులకు వినతులు సమర్పించారు.
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు
సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ గ్రామాల నుంచి అర్జీదారులు సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అధికారులకు వినతులు సమర్పించారు. పాలనాధికారి శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆయా శాఖ అధికారులు ఆయా కౌంటర్ల ద్వారా అర్జీలు స్వీకరించారు. వీటిల్లో భూ సమస్యలే ఎక్కువ. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను పాలనాధికారి శరత్ ఆదేశించారు.
పంటలు నీట మునుగుతున్నాయి..
సింగూరు కాల్వలను మరమ్మతు చేయాలంటూ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్, చందంపేట గ్రామ రైతులు హనుమాదాస్, రామస్వామి, శంకరయ్య పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. కాల్వలకు గండ్లు పడటంతో రైతుల పంటల పొలాలు నీట మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నీటి ప్రవాహ నియంత్రణకు కాలువపై వాల్వులు ఏర్పాటుచేయాలని కోరారు.
* భూ సమస్యను పరిష్కరించాలని పటాన్చెరుకు చెందిన ప్రవీణ్, బాలయ్య వట్పల్లికి చెందిన సంగమేశ్ కోరారు.
* రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని సంగారెడ్డికి చెందిన విమలమ్మ, నారాయణ కోరారు.
* బ్యాంకు రుణం మంజూరు చేసి ఆదుకోవాలని చౌటకూరుకు చెందిన ప్రకాశ్ విజ్ఞప్తి చేశారు.
* బాలిక సంరక్షణ పథకం కింద సాయం వెంటనే అందించాలని జహీరాబాద్ మండలం రంజోల్కు చెందిన రమేశ్రెడ్డి కోరారు.
కార్తీక్రెడ్డిని కౌశిక్రెడ్డిగా మార్చారు
వెంకట్రెడ్డి, పర్వతాపూర్
నా కుమారుడి పేరు కార్తీక్రెడ్డి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ధరణి పోర్టల్లో కౌశిక్రెడ్డిగా నమోదయింది. అధికారులు చేసిన తప్పు సరిచేయడంలేదు. మండల కార్యాలయంలో అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చా. కలెక్టర్కు ఫిర్యాదుచేస్తే స్పందన ఉంటుందన్న ఆశతో ఇక్కడిదాకా వచ్చా. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలి.
‘ఆసరా’ ఇప్పించరూ
లక్ష్మణ్రావు, ఉసిరికపల్లి
57 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి పింఛను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తు చేశా. పింఛను మంజూరుకు అవసరమైన అర్హతలు ఉన్నా నా పేరు జాబితాలో లేదు. మండల స్థాయిలో అధికారులను అడిగితే కలెక్టరేట్లో తెలుసుకోవాలని సూచించారు. ఇక్కడికి వస్తే మళ్లీ మండల కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్నారు. అధికారుల తీరు సరికాదు.
ఆన్లైన్లో వివరాలు సరి చేయాలి
- శంకరయ్య, ఎర్దనూరు
ధరణి పోర్టల్లో పాత రికార్డుల ప్రకారం వివరాలను నమోదుచేయాల్సి ఉండగా అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. తమ భూమి వివరాలు ఆన్లైన్లో కనిపించకపోవడంతో బ్యాంకు అధికారులు పంట రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వివరాలు నమోదుచేసి న్యాయం చేయాలి.
పింఛన్ కోసం..
ఈనాడు, సంగారెడ్డి: కోహీర్ మండలానికి చెందిన సత్తార్ లారీ డ్రైవర్. ఆయనకు మూడు నెలలుగా పింఛన్ ఆగిపోవడంతో తన స్నేహితుడు రహమాన్తో కలిసి సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. అధికారులకు తమ సమస్యను విన్నవించారు. వచ్చె నెల నుంచి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్