చకచకా పనులు.. తప్పనున్న ప్రమాదాలు
ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో 44వ జాతీయ రహదారిపై చేగుంట సమీపంలో బైపాస్ సర్కిల్ వద్ద ఉపరితల వంతెన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పనులు చురుకుగా సాగుతున్నాయి.
న్యూస్టుడే, చేగుంట
ఉపరితల వంతెన నిర్మించే ప్రాంతం
ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో 44వ జాతీయ రహదారిపై చేగుంట సమీపంలో బైపాస్ సర్కిల్ వద్ద ఉపరితల వంతెన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇటీవల కేంద్రం నిధులు మంజూరు చేయడంతో మరింత జోరందుకున్నాయి.
నాలుగు వరుసలుగా..
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకున్న 44 జాతీయ రహదారి జిల్లాలో మనోహరాబాద్, తూప్రాన్, మాసాయిపేట, చేగుంట, నార్సింగి, రామాయంపేట మండలాల మీదుగా వెళ్తోంది. 2006 వరకు రెండు వరుసలుగా ఉండేది. ఈ సమయంలో జిల్లాలో ఆయా మండలాల పరిధిలో జాతీయ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యం. ఆ తర్వాత నాలుగు వరుసలకు విస్తరించడంతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. చేగుంట వద్ద రెడ్డిపల్లి బైపాస్ సర్కిల్ వద్ద మాత్రం పరిస్థితి అలాగే ఉంది. రోడ్డు దాటుతున్న సమయంలో దుర్ఘటనలు జరిగాయి. ఇక్కడ ఉపరితల వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు కేంద్రం స్పందించి రెండేళ్ల కిందట వంతెన మంజూరు చేసింది. జాతీయ రహదారి ప్రాదికార సంస్త టెండర్లు పూర్తిచేసి గతేడాది పనులను ప్రారంభించారు.
వంతెన నిర్మాణ పనులు
సర్వీస్ రహదారి
ఈ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం ఉపరితల వంతెన పనులు సాగుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇరువైపులా సర్వీసు రోడ్డు వేశారు. ఈ మార్గాలు భవిష్యత్తులో చేగుంటకు వచ్చి వెళ్లేందుకు ఉపయోగపడనున్నాయి. ఏడాదిలో వంతెన నిర్మాణం పూర్తిచేసే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. పలకలు బిగించే పనులు సాగుతున్నాయి.
జప్తిశివునూర్ వద్ద..
నార్సింగి మండలం జప్తిశివునూర్ వద్ద కూడా కేంద్రం వంతెనను మంజూరు చేసింది. ఇందుకు రూ. 29 కోట్లు కేటాయించింది. ఇక్కడ నెల కిందట సదరు పనులు షూరు అయ్యాయి. ప్రస్తుతం సర్వీసు దారితో పాటు అవసరం ఉన్న చోట చిన్న వంతెనలు విస్తరిస్తున్నారు. ఇక ఈ రెండు పూర్తయితే ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ప్రయాణం సాఫీగా సాగించే వీలుంటుంది.
ఎంతోమందికి మేలు: నరేందర్
చేగుంట బైపాస్ సర్కిల్ వద్ద రాకపోకలకు భయంగా ఉండేది. ముఖ్యంగా రోడ్డు దాటుతున్న సమయంలో ఎక్కడి నుంచి వాహనం వేగంగా వచ్చి ఢీకొంటుందనే ఆందోళన. ఉపరితల వంతెన నిర్మాణంతో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఎంతోమందికి మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా