ఆత్మస్థైర్యం.. రక్షణకు దోహదం
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, విద్యార్థినులపై అకృత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినుల ఆత్మరక్షణ విద్య నేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యార్థినులకు కరాటే శిక్షణ
న్యూస్టుడే, పెద్దశంకరంపేట, మెదక్ అర్బన్, చిలప్చెడ్
గౌతాపూర్లో సాధన చేస్తున్న విద్యార్థినులు
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, విద్యార్థినులపై అకృత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినుల ఆత్మరక్షణ విద్య నేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు తమని తాము రక్షించుకునేందుకు అవసరమని గుర్తించి ఈ దిశగా అడుగులు వేయడం గమనార్హం. నాలుగేళ్ల కిందట బాలికలకు కరాటే శిక్షణ ఇవ్వగా పలు కారణాలతో నిలిచిపోయింది. తిరిగి దాన్ని పునరుద్ధరించారు.
190 పాఠశాలల్లో..
ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థినులు చదువుతో పాటు కరాటేలో తర్ఫీదు పొందేందుకు అవకాశం దక్కింది. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో 924 సర్కారు బడులు ఉన్నాయి. తొలి విడతలో ఎంపిక చేసిన 127 జడ్పీ బాలికల ఉన్నత, 6 ఉన్నత, 15 కస్తూర్బాలు, 42 ప్రాథమికోన్నత పాఠశాలల్లో నేర్పిస్తున్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ‘రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ ప్రశిక్షణ్’ కార్యక్రమం దీన్ని ప్రారంభించారు. జనవరి 24న మొదలవగా.. నెలరోజుల పాటు ఇస్తున్నారు. ఇన్స్ట్రక్టర్లుగా ఏజెన్సీల ద్వారా నియమించుకొని రూ.5 వేల చొప్పున పాఠశాల నుంచి చెల్లించేలా రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. 10 వేల మంది తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రమే అవకాశాన్ని కల్పించారు.
ధీమా పెంచేలా..
ఏదైనా అనుకోని ఘటన ఎదురైనా బాలికలు తమని తాము రక్షించుకునే ఆత్మవిశ్వాసం, ధీమా పెంచేందుకు కరాటే శిక్షణ తోడ్పడుతుంది. ఇప్పటికే పట్టణాల్లో కొంతమంది ప్రైవేటుగా ఫీజు చెల్లిస్తూ కరాటేలో శిక్షణ పొందుతున్నారు. గతంలో సర్వశిక్షా అభియాన్ ద్వారా నిధులిచ్చి తరగతులు నిర్వహించారు. కానీ కరోనా ప్రభావం అనంతరం ఇది కాస్త అటకెక్కింది. యుద్ధ విద్యలైన కుంగ్ఫూ, కరాటే, జూడో వంటివి నేర్పించేలా శిక్షకులను నియమించారు. జనవరి 24న ప్రారంభించగా నెల రోజుల పాటు కొనసాగించనున్నారు. నిత్యం గంట పాటు తర్ఫీదు ఇస్తున్నారు. కనీసం ఆరునెలల పాటు అవకాశం కల్పిస్తే వారు ఏమైనా నేర్చుకునే అవకాశం లభిస్తుందని శిక్షకులు చెబుతున్నారు.
ఏ రంగంలోనైనా..
-జ్యోతి, జిల్లా బాలికల సంరక్షణ అధికారిణి
జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో బాలికలకు ఉచిత కరాటే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం నెలరోజుల పాటు బడుల్లో కార్యక్రమం కొనసాగనుంది. పిల్లల్లో నమ్మకం పెంచుతుంది. దీంతో ఏ రంగాల్లోనైనా రాణించే అవకాశం ఏర్పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!