‘కాంగ్రెస్ ఎల్లప్పుడూ పేదల పక్షమే’
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు పేదప్రజల పక్షమే వహిస్తుందని కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలం రాంతీర్థం, ముద్దాపూర్ గ్రామాల్లో పార్టీ చేపట్టిన ‘హాథ్ సే.. హాథ్ జోడో’ కార్యక్రమం నిర్వహించారు.
రాంతీర్థంలో యాత్ర గురించి వివరిస్తున్న ప్రభాకర్రెడ్డి, బాలకృష్ణ, తదితరులు
పాపన్నపేట, న్యూస్టుడే: కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు పేదప్రజల పక్షమే వహిస్తుందని కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలం రాంతీర్థం, ముద్దాపూర్ గ్రామాల్లో పార్టీ చేపట్టిన ‘హాథ్ సే.. హాథ్ జోడో’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విషయాలను వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. అనంతరం ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వరంగల్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు మద్దతు ధర పెంచుతామన్నారు. కుటుంబంలో అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ సభ్యులు మ్యాడం బాలకృష్ణ, ఆంజనేయులు, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, కిసాన్సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి నిటాలక్షప్ప, పార్టీ మండలాధ్యక్షుడు గోవింద్ నాయక్, ఎంపీటీసీ సభ్యులు రమేశ్గౌడ్, శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్, మైనార్టీ మండలాధ్యక్షుడు కలీం తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి