ఒడిశా కార్మికులకు విముక్తి
సీఐడీ అదనపు డీజీపీకి ట్విట్టర్ ద్వారా అపరిచిత వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఇటుకబట్టీలో నిర్బంధించిన ఆరుగురు ఒడిశా కార్మికులకు సీఐడీ పోలీసులు విముక్తి కల్పించారు.
సీఐడీ అదనపు డీజీపీకి ట్విట్టర్లో ఫిర్యాదు
వివరాలు వెల్లడిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా సీఐడీ ఏఎస్పీ జి.వెంకటేశ్వర్లు చిత్రంలో కార్మికులు
మెదక్ రూరల్, న్యూస్టుడే: సీఐడీ అదనపు డీజీపీకి ట్విట్టర్ ద్వారా అపరిచిత వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఇటుకబట్టీలో నిర్బంధించిన ఆరుగురు ఒడిశా కార్మికులకు సీఐడీ పోలీసులు విముక్తి కల్పించారు. స్థానిక గ్రామీణ ఠాణాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా సీఐడీ ఏఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. మెదక్ పట్టణం నవాబుపేటకు చెందిన తుమ్మల లక్ష్మీనారాయణ మెదక్ మండలం మాచవరంలో ఇటుకబట్టీ నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని బొలంగీర్ జిల్లా రాఘవబదార్కు చెందిన గత్వాల్ రాణా, ముకుంద్రాణా, సురేంద్రరాణా, సుదమ్రాణా, ప్రకాశ్రాణా, నీరు బధోయ్ రెండేళ్ల కిందట మాచవరానికి తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నాడు. గత కొంత కాలంగా కూలీ డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదు. నివాస ప్రాంతంలో తగిన వసతులు కల్పించకుండా, స్వస్థలాలకు వెళ్లనివ్వకుండా, బంధువులకు కనీసం ఫోన్లు చేయనివ్వకుండా నిర్బంధించి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి సోమవారం సీఐడీ అదనపు డీజీపీ మహేశ్ భగవత్కు ట్వీట్ చేశారు. స్పందించిన ఆయన విచారణ చేపట్టాలని ఉమ్మడి మెదక్ జిల్లా సీఐడీ ఏఎస్పీ వెంకటేశ్వర్లును ఆదేశించారు. నర్సాపూర్ సహాయ కార్మికశాఖ అధికారి సత్యేంద్ర ప్రసాద్, గ్రామీణ సీఐ విజయ్, ఆర్ఐ నాగరాజులతో కలిసి సీఐడీ ఏఎస్పీ మంగళవారం ఇటుక బట్టీపై దాడి చేసి, కార్మికులకు విముక్తి కల్పించారు. లక్ష్మీనారాయణపై 14(1), 1986 చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. బట్టి యజమాని నుంచి రూ.37,000ను కార్మికులకు ఇప్పించారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సహకారంతో కార్మికులను స్వస్థలాలకు పంపారు. సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా సీఐడీ డీఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, సీఐలు జగదీశ్వర్, సురేష్, సతీశ్కుమార్, జయేష్కుమార్, ఎస్ఐలు కృష్ణమూర్తి, అంజయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్