ప్రత్యేక నిధి.. పనులు నెమ్మది!
గతేడాది సీఎం కేసీఆర్ నారాయణఖేడ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేశారు. ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలు కేటాయిస్తామని ప్రకటించి, మౌలిక వసతులు కల్పించుకోవాలని సూచించారు.
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట టౌన్
కిషన్నాయక్తండాలో సీసీరోడ్డు నిర్మించాల్సిన కాలనీ
గతేడాది సీఎం కేసీఆర్ నారాయణఖేడ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేశారు. ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలు కేటాయిస్తామని ప్రకటించి, మౌలిక వసతులు కల్పించుకోవాలని సూచించారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే నెలలు గడుస్తున్నా, అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వాటి ప్రగతిపై పరిశీలన కథనం.
జిల్లాలో గత జులైలో 2,479 పనులకు రూ.121.90 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోంచి ప్రతి పంచాయతీకి నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో పనులు చేపట్టాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటిల్లో అత్యధికంగా సీసీ రోడ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే జాప్యం కొనసాగుతోంది. ప్రస్తుతం అనువైన సమయం.. వాటిని త్వరగా చేపట్టి పూర్తి చేస్తే ప్రజల ప్రయాణం సాఫీగా సాగేందుకు వీలు పడుతుంది. నిధులు ఇచ్చినందుకు సార్థకత ఉంటుంది.
క్షేత్ర స్థాయిలో పరిస్థితి
* సంగారెడ్డి నియోజకవర్గంలో 340 పనులకు రూ.17.20 కోట్లు ఇచ్చారు. వాటిలో ఇప్పటి వరకు 33 పూర్తి చేయగా, 32 ప్రగతిలో ఉన్నాయి. 275 ఇంకా ప్రారంభం కాకపోవడం గమనార్హం.
* జహీరాబాద్ నియోజకవర్గంలో 638 పనులకు రూ.28.10 కోట్లు విడుదల చేయగా, 31 పనులు పూర్తి చేయగా 74 ప్రగతిలో ఉన్నాయి. 533 పనులకు ఇంకా తట్ట్టెడు మట్టి తీయలేదు.
* నారాయణఖేడ్ నియోజకవర్గంలో 832 పనులకు రూ.37.60 కోట్లు కేటాయించారు. 143 పనులు ప్రారంభించగా 78 ప్రగతిలో ఉండగా 611 పనులకు ఇంకా అతీగతీలేదు. పనులను చేపట్టేందుకు పంచాయతీల పాలకవర్గాలు వెనుకడుగు వేస్తున్నాయి. గతంలో చేసిన పనుల బిల్లులు పెండింగులో ఉండటానికి తోడు అసెంబ్లీ ఎన్నికలకు 10 నెలలే సమయం ఉండటంతో చేసిన పనులకు సకాలంలో బిల్లుల వస్తాయా రావా అనే సందేహంతో వెనుకడుగు వేస్తున్నారు. అప్పు తెచ్చి పనులు చేయిస్తే వడ్డీ భరించే పరిస్థితిలేకపోవడంతో ఆసక్తి చూపడంలేదు.
* అందోలు నియోజకవర్గంలో 454 పనులకు రూ.28 కోట్లు మంజూరు చేశారు. 42 పనులు ప్రారంభించగా, 67 పనులు ప్రగతి దశల్లో ఉన్నాయి. 345 పనులు ప్రారంభానికి నోచలేదు. అన్నసాగర్లో బిల్లులు రావని పనులు చేపట్టలేదు. నేరడిగుంటలో ప్రతిపక్ష పార్టీ కావడం వల్ల నిధులు ఇవ్వలేదని సర్పంచి వాపోతున్నారు.
మార్చిలోపు పూర్తి చేసేందుకు కృషి
జగదీశ్వర్, పీఆర్ ఈఈ, సంగారెడ్డి.
జిల్లాలో ఇప్పటికే ఉపాధి, మనఊరు- మనబడి కార్యక్రమంతోపాటు ఎస్డీఎఫ్ పనులు కొనసాగుతున్నాయి. మార్చి 31లోపు ఆయా పనులు పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నాం. బిల్లుల సమస్య లేదు. ప్రస్తుతం ఆయా పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇంకా వేగంగా పెంచేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM