క్రీడా స్ఫూర్తి.. యువ దీప్తి
రెండు నెలలు.. 256 మ్యాచ్లు.. 257 జట్లు.. 19.58 లక్షల మంది వీక్షకులు (క్రీడాభిమానులు).. 5 వేల మంది క్రీడాకారులతో సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ గతేడాది అందరి దృష్టిని ఆకర్షించింది.
అవార్డు దక్కించుకున్న ‘సీఎం కేసీఆర్ ట్రోఫీ
న్యూస్టుడే, సిద్దిపేట
బ్యాటింగ్ చేస్తున్న మంత్రి హరీశ్రావు
రెండు నెలలు.. 256 మ్యాచ్లు.. 257 జట్లు.. 19.58 లక్షల మంది వీక్షకులు (క్రీడాభిమానులు).. 5 వేల మంది క్రీడాకారులతో సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ గతేడాది అందరి దృష్టిని ఆకర్షించింది. మంత్రి హరీశ్రావు సారథ్యంతో యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలిస్తూ సిద్దిపేటలో వివిధ దశల్లో మ్యాచ్లు కొనసాగాయి. ఈ తరుణంలోనే అతిపెద్ద టోర్నీ-2022గా నిలవగా, ‘క్రిక్ హీరోస్’ సంస్థ (యాప్) పురస్కారాన్ని ప్రకటించడం విశేషం.
ఆదర్శ పంథా : గతేడాది ఫిబ్రవరి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు సిద్దిపేట క్రీడా మైదానం వేదికగా టోర్నీ కొనసాగింది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని మంత్రి ఆధ్వర్యంలో కొనసాగింది. ఇప్పటికే సిద్దిపేట వివిధ రంగాల్లో ప్రత్యేకతను చాటుతోంది. పలు అంశాల్లో ఆదర్శ పంథాను కొనసాగిస్తూ వివిధ స్థాయిల్లో పురస్కారాలు స్వీకరించింది. క్రీడా రంగంలోనూ తనదైన ముద్రవేసేలా.. యువతను క్రీడా మైదానాల వైపు మళ్లించారు. అందుకు సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నీ దోహదం చేసింది.
మంత్రి నేతృత్వం : మూడేళ్లుగా మంత్రి నేతృత్వంలో పోటీలు సాగుతున్నాయి. ఈ తరుణంలో 2022లో అతిపెద్ద టోర్నీగా (సీజన్-2) నిలిచింది. అత్యధిక జట్లు.. పెద్దసంఖ్యలో క్రీడాకారులు ఇందులో భాగస్వాములు అయ్యారు. జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో ప్రకటించిన పురస్కారాలలో బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. సిద్దిపేటలో సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ (సీజన్-3) ప్రారంభోత్సవం రోజున నిర్వాహకులైన మంత్రి హరీశ్రావుకు సంబంధిత ప్రతినిధులు పురస్కారాన్ని అందించనున్నారు.
పక్కా ప్రణాళిక : మూడేళ్ల కిందట సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా క్రికెట్ టోర్నీ మొదలెట్టారు. యువత ఆసక్తి చూపగా.. పక్కా ప్రణాళికతో నిర్వాహకులు ముందుకు సాగారు. తొలిది విజయవంతం కావడంతో ఏటా నిర్వహణకు నిర్ణయించారు. ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్య రాత్రింబవళ్లు మ్యాచ్లు జరిగాయి. పలువురు ప్రముఖులు హాజరై ప్రోత్సహించారు. కథానాయకులు అఖిల్, సుమన్, క్రికెట్ ప్రముఖులు నోయల్ డేవిడ్, చాముండేశ్వరీనాథ్, తిలక్వర్మ తదితరులు హాజరయ్యారు. పురస్కారం మరింత బాధ్యత పెంచిందని గతంలో నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మచ్చ వేణుగోపాల్రెడ్డి, కలకుంట్ల మల్లికార్జున్ తెలిపారు.
దక్కిన గౌరవం: మంత్రి హరీశ్రావు
సిద్దిపేట క్రీడాకారులు, యువ స్ఫూర్తికి దక్కిన గౌరవం ఇది. జిల్లా కేంద్రంలోని మైదానం ఎంతో మంది క్రీడాకారులకు చక్కటి వేదికగా మారింది. ఇద్దరు రంజీ వరకు వెళ్లారు. గల్లీ నుంచి దిల్లీస్థాయిలో ఈ ప్రాంత కీర్తి చేరడం ఆనందంగా ఉంది. క్రిక్ హీరోస్ ప్రతినిధులకు ధన్యవాదాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి