దృష్టి సారిస్తేనే.. పుష్టి!
చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ బడుల్లో గుడ్డు అందిస్తున్నారు. వారానికి మూడు రోజులు భోజనంలో వీటిని ఇవ్వాలనే నిబంధన ఉంది.
20,916 మంది చిన్నారులకు అందని గుడ్డు
న్యూస్టుడే, మెదక్, హవేలిఘనపూర్, శివ్వంపేట
హవేలిఘనపూర్ జడ్పీహెచ్ఎస్లో..
చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ బడుల్లో గుడ్డు అందిస్తున్నారు. వారానికి మూడు రోజులు భోజనంలో వీటిని ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే స్థానికంగానే వంట చేసే చోట సమస్య లేదు. అక్షయపాత్ర ద్వారా సరఫరా చేసే పాఠశాలల్లో మాత్రమే ఈ పరిస్థితి నెలకొంది. పలుప్రాంతాల్లో వంట నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో, అక్షయపాత్రకు భోజన బాధ్యతలు అప్పగించారు. వీరు గుడ్డు సరఫరా చేయకపోవడంతో, చిన్నారులు పోషక ఆహారానికి దూరం అవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఈ అంశంపై ‘న్యూస్టుడే’ కథనం...
విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 898 సర్కారు పాఠశాలల్లో 88,919 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఆరు రోజుల పాటు భోజనాన్ని అందిస్తున్నారు. నిత్యం వివిధ రకాల కూరగాయలతో చేసిన కూరలను వడ్డిస్తున్నారు. కరోనాతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం గిట్టుబాటు కాకపోవడంతో చాలా చోట్ల వంట ఏజెన్సీలు ముందుకు రాలేదు. దీంతో పలు పాఠశాలలకు అక్షయపాత్ర ద్వారా భోజనం సరఫరా అవుతోంది. సాధారణంగా మధ్యాహ్న భోజనం వడ్డించే నిర్వాహకులు వారానికి మూడు సార్లు ఉడికించిన గుడ్డును విద్యార్థులకు అందజేస్తున్నారు. అక్షయపాత్ర భోజనం వెళ్లే పాఠశాలల్లో ఇవ్వడంలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుడ్డు ఉడికించి ఇవ్వమని చెబుతున్నారు. కేవలం పప్పుచారు, ఒక కూర మాత్రమే అందిస్తున్నారు.
రూ.12.54 లక్షలు వాడుకోలేని పరిస్థితి
జిల్లాలోని 113 ప్రభుత్వ పాఠశాలల్లో అక్షయపాత్ర ద్వారా భోజనం సరఫరా అవుతోంది. ఈ పాఠశాలల్లో 20,916 మంది విద్యార్థులున్నారు. నెలకు ఒక్కో విద్యార్థికి 12 అందుతాయి. వీటిని సరఫరా చేసేవారికి ఒక్కో దానికి రూ.5 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ లెక్కన ఒక విద్యార్థిపై నెలకు రూ.60 ఖర్చు పెడుతుంది. విద్యార్థులందరికి ఈ మొత్తం రూ.12.54 లక్షలకు చేరుతుంది. అక్షయపాత్ర ద్వారా గుడ్డు ఇవ్వకపోవడం, ప్రత్యామ్నాయంగా వేరే మార్గాల ద్వారా దీనిని అందించకపోవడంతో ఈ డబ్బును జిల్లాలో సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది.
గుడ్డు లేని భోజనం
ప్రత్యామ్నాయం లేదు..అక్షయపాత్ర నిర్వాహకులు గుడ్డు బదులు ఇది వరకు స్వీటు అందజేసేవారు. గత కొన్ని రోజులుగా అది కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వ బడుల్లో కోడిగుడ్లు ఉడికించేందుకు అవసరమైన మౌలిక వసతులు లేకపోవడంతో సమస్య ఎదురవుతోంది. బిల్లుల జాప్యం, తక్కువ డబ్బులు చెల్లిస్తుండటంతో చాలా మంది వంట చేయడానికి ఆసక్తి చూపడం లేదని ఉపాధ్యాయులు వివరిస్తున్నారు.
శాకాహారం మాత్రమే సరఫరా చేస్తారు
- రమేశ్కుమార్, డీఈవో
మధ్యాహ్నభోజన నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో అక్షయపాత్ర ద్వారా జిల్లాలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్నభోజనాన్ని అందిస్తున్నాం. వారు సేవాధృక్పథంతో ముందుకు వచ్చారు. పూర్తిగా శాకాహారం మాత్రమే సరఫరా చేస్తామన్నారు. గుడ్డుకు బదులు అరటిపండు, పల్లిపట్టి, స్వీటు అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులకు నిర్వహణ నిధులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 50శాతం నిధులు గత ఏడాది జులైలో ప్రభుత్వం విడుదల చేసింది. -
కొత్త రేషన్కార్డులకు.. కోడ్ అడ్డంకి
[ 28-03-2024]
ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది. -
సర్పంచి నుంచి.. ఎంపీ అభ్యర్థిగా..
[ 28-03-2024]
సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్ పొందడం గమనార్హం. -
గడువు ముంగిట పనుల హడావుడి
[ 28-03-2024]
పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు. -
కార్మికులకు గుర్తింపు.. పథకాలతో ప్రయోజనాలు
[ 28-03-2024]
కార్మికులకు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి జారీ చేసే గుర్తింపు కార్డులు చాలా ముఖ్యం. దీంతో సంఘంలో గుర్తింపు పాటు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. -
విద్యార్థులకు ప్రేరణ
[ 28-03-2024]
ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రేరణ పేరుతో వారికి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
ఈత కొలను తెరవరా?
[ 28-03-2024]
సిద్దిపేటలోని ఈత కొలను నిర్వహణ కొరవడుతోంది. నిత్యం కొనసాగించాల్సిన ఈ కొలను.. వేసవి ఆరంభమైన ఇంకా తెరవడం లేదు. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించి అందుబాటులోకి తెచ్చారు. -
అరచేతిలో లక్షల పుస్తకాలు
[ 28-03-2024]
ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు, కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
స్పందించండి.. సంధించండి
[ 28-03-2024]
ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా.. ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది. -
మహిళాభ్యున్నతికి సహకారం
[ 28-03-2024]
సహకార బ్యాంకులు మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైౖతులకు రుణాలు ఇవ్వడం..వసూలు చేయడానికి ఇవి గతంలో పరిమితమయ్యేవి. ఇప్పుడు మహిళలు అర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నాయి. -
దాత ఔదార్యం.. భక్తులకు సౌకర్యం
[ 28-03-2024]
వారి కులదైవమంటే ఆ దంపతులకు చాలా నమ్మకం. సొంత ఖర్చుతో దైవానికి ఆలయం నిర్మించారు. సరైన దారి లేక దర్శనానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించి తాజాగా వంతెన నిర్మిస్తున్నారు. -
ఆస్తి కోసం చిన్నమ్మనే కడతేర్చాడు
[ 28-03-2024]
ఈనెల 21న టేక్మాల్ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. -
నిండు మనసుతో ఆశీర్వదించండి
[ 28-03-2024]
ఈ ప్రాంత ప్రజాసమస్యలపై లోతైన అవగాహన ఉందని, ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించాలని మెదక్ పార్లమెంట్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. -
మాజీ కలెక్టర్కు వేల కోట్లు ఎక్కడివి?
[ 28-03-2024]
భారాస మెదక్ లోక్సభ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు.డిమాండ్ చేశారు. -
భారాస విజయం తథ్యం: కొత్త ప్రభాకర్రెడ్డి
[ 28-03-2024]
మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించటం తథ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లో మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు