పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం తగదు
మనఊరు-మనబడి ద్వారా ఎంపికచేసిన పాఠశాలల్లో రూ.30లక్షలలోపు చేపట్టిన పనులను సత్వరం పూర్తి చేయాలని పాలనాధికారి రాజర్షిషా ఆదేశించారు.
పాలనాధికారి రాజర్షిషా
మాట్లాడుతున్న పాలనాధికారి రాజర్షిషా, అదనపు పాలనాధికారిణి ప్రతిమాసింగ్
మెదక్, న్యూస్టుడే: మనఊరు-మనబడి ద్వారా ఎంపికచేసిన పాఠశాలల్లో రూ.30లక్షలలోపు చేపట్టిన పనులను సత్వరం పూర్తి చేయాలని పాలనాధికారి రాజర్షిషా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలాల్లో ఐదు పాఠశాలలలోపు పనులు ఉంటే వాటిని ఈనెలాఖరులోగా, ఆపై ఉన్నవాటిని ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి, నివేదిక అందజేయాలన్నారు. నిధుల కొరత లేదని, చేసిన పనికి ఎప్పటికప్పుడు ఎంబీ రికార్డు చేసి, ఎఫ్టీవో పోర్టల్లో వివరాలు నమోదు చేసి కలెక్టర్ లాగిన్కు పంపాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు పగుళ్లు మూసివేసి, ప్రైమరీ, చివరిగా రంగులు వేయాలని, లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
జిల్లాల్లో ముగింపు దశలో ఉన్న 1,600 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని పాలనాధికారి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలపై తహసీల్దార్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, గుత్తేదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న పదిమండలాల్లో తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఉపాధి పథకం ద్వారా సీసీ రహదారులు, మురుగు కాలువ పనులను చేపట్టాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేయాలని సూచించారు. ఇప్పటి వరకు పట్టాలు అందజేసిన 1,234 ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. ఒప్పందంలో నిబంధనల మేరకు సకాలంలో పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు చెప్పారు. సమావేశాల్లో అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్, రమేశ్, పంచాయతీరాజ్శాఖ ఈఈ సత్యనారాయణరెడ్డి, నీటిపారుదలశాఖ ఈఈ శ్రీనివాస్రావు, డీఈవో రమేశ్కుమార్, డీఎస్వో శ్రీనివాస్, డీఈఈ వెంకటేశం, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ