కొత్త డిపో ఆదాయం.. తద్వారా ఆదర్శం
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఆర్టీసీ డిపోను నర్సాపూర్లో ప్రారంభించారు. ఎనిమిది నెలల్లోనే ప్రత్యేకతను చాటుతూ గుర్తింపు పొందుతోంది.
డి…పోలోని ప్రధాన షెడ్డు
న్యూస్టుడే, నర్సాపూర్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఆర్టీసీ డిపోను నర్సాపూర్లో ప్రారంభించారు. ఎనిమిది నెలల్లోనే ప్రత్యేకతను చాటుతూ గుర్తింపు పొందుతోంది. ఆదాయపరంగా హైదరాబాద్ జోన్లో 8వ స్థానంలో నిలిచింది. సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా డిపోలో బస్సుల సంఖ్యను పెంచనున్నారు. ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్థానికంగా డిపో రావాలనే మూడు దశాబ్దాల కల సాకారమై ప్రస్తుతం 22 బస్సులతో కొనసాగుతోంది. వంద మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. కండక్టర్లు, చోదకులు, మెకానిక్కులు, పర్యవేక్షకులు, కాపలదారులు, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. ఐదు ఎకరాల విశాలమైన ఆవరణలో డిపో ఏర్పాటైంది. ఒకేసారి ఆరు బస్సులను మరమ్మతులు చేయగలిగే ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. సిబ్బంది అంతా బృందంగా సమన్వయంతో డిపో ఆదాయం క్రమంగా పెరగడానికి శ్రమిస్తున్నారు. రోజుకు రూ.3.10 లక్షల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని ఇప్పటికి పది సార్లు అధిగమించారు. ఇక్కడ బస్సు డిపోతో పాటు పెట్రోలు బంకును సైతం నిర్వహిస్తున్నారు. తద్వారా రోజూ రూ.2 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. నెలకు రూ.కోటికి పైగా ఆదాయం వివిధ రూపాల్లో సమకూరుతోంది. హైదరాబాద్ జోన్లోని 38 డిపోలలో ఆదాయంలో నర్సాపూర్ డిపో 8వ స్థానంలో ఉంది. గతంలో మూడో స్థానం వరకూ ఒకసారి చేరుకుంది. నర్సాపూర్ నుంచి శ్రీశైలం, జోగిపేట, పటాన్చెరు, అజ్జమర్రి, వెల్దుర్తి... విద్యార్థుల కోసం గోమారం, జక్కపల్లి, గుండ్లమాచనూరు, నల్లవల్లి, కొత్తపల్లి, అల్లీపూర్ తదితర మర్గాల్లో బస్సులు నడుపుతున్నారు. మరో వంద బస్సులు నిలపడానికి డిపోలో స్థలం ఉంది. యాదగిరిగుట్ట, పటాన్చెరు, కౌడిపల్లి, జోగిపేట మార్గంలో నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని డిపో బాధ్యుడు నరేందర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.