కంకర క్రషర్లు..కాలుష్య కేంద్రాలు!
కంకర క్రషర్ల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇళ్లు, పొలాలపై దుమ్ము, ధూళి
ఖాజీపల్లిలో పరిసరాలు ఇలా..
కంకర క్రషర్ల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధిక లోడు వాహనాలతో రహదారులు శిథిలమవడం, క్రష్లర్ల దుమ్ము, ధూళి, రాతి పొడి.. ఇళ్లు, పంట పొలాలపైకి చేరుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా చోదకులు కంకర, రాతి పొడిని తరలిస్తుండటమూ సమస్యగా మారింది. గత నెలలో జరిగిన జడ్పీ సర్వ సభ్య సమావేశంలో సభ్యులు ఈ అంశంపై చర్చించినా.. ఇంత వరకు ఎలాంటి చర్యలు లేవు. ఈ నేపథ్యంలో కథనం.
అందోలు నియోజకవర్గంలో..
కంకర క్వారీల కారణంతో అందోలు, పుల్కల్, చౌటకూరు మండలాల్లోని పలు గ్రామాల రహదారులు గుంతలమయంగా మారాయి. అందోలు మండలం సంగుపేట శివారులో, చౌటకూరు మండలం శివ్వంపేట, పుల్కల్ కూడలికి సమీపంలో క్వారీలు నిర్వహిస్తున్నారు. వీటి నుంచి నిత్యం పదులు సంఖ్యలో అధిక లోడు టిప్పర్లు ప్రధాన రదారులపై వెళుతున్నాయి. అంగడిపేట, ఎస్.ఇటిక్యాల, సంగుపేట, మాసానిపల్లి, పోతిరెడ్డిపల్లి, గొంగ్లూర్ తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దారులు అధ్వానంగా మారడంతో రాకపోకలు సాగించడానికి వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
తండావాసుల గోడు వినే వారేరి?
కంది మండలంలో ఎర్దనూరు, ఎర్దనూరు తండా, బ్యాతోల్ తండా, బేగంపేట తండా సమీపంలో కంకర క్రషర్లు ఉన్నాయి. తండాలకు సమీపంలోనే వీటిని నిర్వహిస్తుండంతో క్రషర్ల దుమ్ము, రాతిపొడి ఇళ్లపై, పంట పొలాలపై పడుతోంది. పంటలు బెబ్బతింటున్నాయి. ప్రజలు శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్నారు. రాతిపొడి తరలింపు సమయంలో చోదకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో దుమ్ము, పొడి ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారిపై పడుతోంది. పలుసార్లు ఆయా తండాల ప్రజలు ఆందోళనలు చేసినా.. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు లేవు.
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, కంది, జోగిపేట, జిన్నారం
పేలుళ్లతో ఇళ్లకు పగుళ్లు
జిన్నారం మండలం ఖాజీపల్లి, మాదారం, రాళ్లకత్వ గ్రామాల్లో 16 క్రషర్లు ఉన్నాయి. కంకర, దుమ్మను టిప్పర్లలో తరలించడం వల్ల సమీప గ్రామాల వాసులు అవస్థలు పడాల్సి వస్తోంది. పరిమితికి మించి రాతిపొడి, కంకర తరలిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. క్రషర్ల నిర్వహణ తీరువల్ల చాలా గ్రామాల్లో పంటల సాగుకు అన్నదాతలు దూరమయ్యారు. పేలుళ్లు తీవ్రంగా ఉంటుండటంతో భూమి కంపించినట్టుగా అవుతోంది. ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. క్రషర్ల ఏర్పాటును ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు
నిర్వాహకులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. వాహనాలల్లో కంకర, రాతిపొడి తరలించేటప్పుడు వాహనాలపై టార్పాలిన్లు కప్పాలి. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. క్రషర్ల పొడి ఇళ్లు, పంట పొలాలపై పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయాలి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
మధుకుమార్, ఇన్ఛార్జి ఏడీ, మైనింగ్ శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులకు నిర్వహణ నిధులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 50శాతం నిధులు గత ఏడాది జులైలో ప్రభుత్వం విడుదల చేసింది. -
కొత్త రేషన్కార్డులకు.. కోడ్ అడ్డంకి
[ 28-03-2024]
ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది. -
సర్పంచి నుంచి.. ఎంపీ అభ్యర్థిగా..
[ 28-03-2024]
సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్ పొందడం గమనార్హం. -
గడువు ముంగిట పనుల హడావుడి
[ 28-03-2024]
పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు. -
కార్మికులకు గుర్తింపు.. పథకాలతో ప్రయోజనాలు
[ 28-03-2024]
కార్మికులకు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి జారీ చేసే గుర్తింపు కార్డులు చాలా ముఖ్యం. దీంతో సంఘంలో గుర్తింపు పాటు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. -
విద్యార్థులకు ప్రేరణ
[ 28-03-2024]
ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రేరణ పేరుతో వారికి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
ఈత కొలను తెరవరా?
[ 28-03-2024]
సిద్దిపేటలోని ఈత కొలను నిర్వహణ కొరవడుతోంది. నిత్యం కొనసాగించాల్సిన ఈ కొలను.. వేసవి ఆరంభమైన ఇంకా తెరవడం లేదు. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించి అందుబాటులోకి తెచ్చారు. -
అరచేతిలో లక్షల పుస్తకాలు
[ 28-03-2024]
ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు, కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
స్పందించండి.. సంధించండి
[ 28-03-2024]
ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా.. ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది. -
మహిళాభ్యున్నతికి సహకారం
[ 28-03-2024]
సహకార బ్యాంకులు మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైౖతులకు రుణాలు ఇవ్వడం..వసూలు చేయడానికి ఇవి గతంలో పరిమితమయ్యేవి. ఇప్పుడు మహిళలు అర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నాయి. -
దాత ఔదార్యం.. భక్తులకు సౌకర్యం
[ 28-03-2024]
వారి కులదైవమంటే ఆ దంపతులకు చాలా నమ్మకం. సొంత ఖర్చుతో దైవానికి ఆలయం నిర్మించారు. సరైన దారి లేక దర్శనానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించి తాజాగా వంతెన నిర్మిస్తున్నారు. -
ఆస్తి కోసం చిన్నమ్మనే కడతేర్చాడు
[ 28-03-2024]
ఈనెల 21న టేక్మాల్ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. -
నిండు మనసుతో ఆశీర్వదించండి
[ 28-03-2024]
ఈ ప్రాంత ప్రజాసమస్యలపై లోతైన అవగాహన ఉందని, ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించాలని మెదక్ పార్లమెంట్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. -
మాజీ కలెక్టర్కు వేల కోట్లు ఎక్కడివి?
[ 28-03-2024]
భారాస మెదక్ లోక్సభ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు.డిమాండ్ చేశారు. -
భారాస విజయం తథ్యం: కొత్త ప్రభాకర్రెడ్డి
[ 28-03-2024]
మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించటం తథ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లో మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్